హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ

ఏప్రిల్ 25న మహా హిందూ సమ్మేళనం!

హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట పట్టణం ఆధ్యాత్మిక వాతావరణంలో మునిగిపోనుంది. ఈ నెల 25న పట్టణంలోని శ్రీ విశ్వేశ్వర స్వామి దేవాలయం (బొమ్మల గుడి)లో మహా హిందూ సమ్మేళనం నిర్వహించేందుకు ఏర్పాట్లు జోరుగా సాగుతున్నాయి. గోపూజతో ప్రారంభమయ్యే ఈ కార్యక్రమం భక్తుల్లో విశేష ఉత్సాహాన్ని రేకెత్తిస్తోంది.
పట్టణంతో పాటు పరిసర ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి ఈ ఆధ్యాత్మిక వేడుకను విజయవంతం చేయాలని మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పిలుపునిచ్చారు. సనాతన సంప్రదాయాల పరిరక్షణతో పాటు సమాజంలో ఐక్యతను పెంపొందించడమే ఈ సమ్మేళనం లక్ష్యమని తెలిపారు.
ఇప్పటికే కార్యక్రమానికి సంబంధించిన ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకలో స్థానిక కౌన్సిలర్ చందా రాజు, బచ్చు భాస్కర్, యాంసాని సురేష్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.
ఈ సమ్మేళనం జమ్మికుంటలో ఆధ్యాత్మిక ఉత్సవంగా నిలవనుందని స్థానికులు భావిస్తున్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా. జమ్మికుంటలో రెచ్చిపోతున్న ఇసుక మాఫియా.
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 19 (తెలంగాణ ముచ్చట్లు):   కరీంనగర్ జిల్లా జమ్మికుంట, వీణవంక మండలాల్లో ఇసుక అక్రమ రవాణా అదుపు తప్పింది. ఇసుక దొరకడం కష్టంగా మారడంతో...
డంపింగ్ యార్డ్‌పై అగ్గిరాజేసిన నిరసనలు.
హిందూ సమ్మేళనం కోసం జమ్మికుంట రెడీ
రోడ్డు దుస్థితి… ప్రజలకు నరకయాతన 
రోడ్డు విస్తరణతో రోడ్డున పడిన చిరు వ్యాపారులు
భీమదేవరపల్లిలో రోడ్డు ప్రమాదం: ఒకరు మృతి, ఇద్దరికి తీవ్ర గాయాలు,
వరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు ఎప్పుడూ?