గుర్తు తెలియని మృతదేహం కలకలం.!
సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ దగ్గర ఘటన.
సత్తుపల్లి, మార్చి 30(తెలంగాణ ముచ్చట్లు):
సత్తుపల్లి సింగరేణి క్వార్టర్స్ ప్రాంతంలోని జామాయిల్ తోటలో గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమవడం కలకలం రేపింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించగా, సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పరిశీలించారు. మృతదేహం బాగా కుళ్లిపోయి అస్థిపంజరంలా మారిన స్థితిలో ఉండటం వల్ల గుర్తింపు కష్టంగా మారింది. మృతుడు నీలం రంగు ప్యాంటు ధరించి ఉండగా, కుడి చేతికి ఎరుపు రంగు దారం కట్టుకున్నట్లు గుర్తించారు. దవడ భాగంలో శస్త్రచికిత్స చేసినట్లు ఐరన్ ప్లేట్ ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వయస్సు సుమారు 25 నుంచి 30 సంవత్సరాల మధ్యగా అంచనా వేస్తున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు, మృతదేహాన్ని సత్తుపల్లి ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు సత్తుపల్లి పోలీస్ స్టేషన్ను సంప్రదించాలని కోరారు. ఫోన్ నెంబర్: 87126 59167, 8712551362


Comments