సీతారాముల కళ్యాణం మహోత్సవంలో పాల్గొన్న జంగం శివ దంపతులు
పెద్దమందడి,మార్చి27(తెలంగాణ ముచ్చట్లు):
శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకొని పెద్దమందడి మండలం కేంద్రంలో శ్రీ సీతారాములవారి దివ్య కళ్యాణ మహోత్సవం భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా నిర్వహించబడింది. ఆలయ ప్రాంగణం పండుగ వాతావరణంతో కళకళలాడగా, భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై కళ్యాణాన్ని దర్శించుకున్నారు.ఈ కార్యక్రమానికి పెద్దమందడి కాంగ్రెస్ పార్టీ 8వ వార్డు సభ్యులు శ్రీ జంగం పద్మ, జంగం శివ దంపతులు హాజరై స్వామివారికి పూజా సామాగ్రితో పాటు మంగళసూత్ర అలంకరణ మెట్టెలు (తాళిబొట్టు సామగ్రి)ను సమర్పించారు.అనంతరం వారు భక్తిశ్రద్ధలతో పూజల్లో పాల్గొన్నారు.కళ్యాణం అనంతరం స్వామివార్లను దర్శించుకుని, గ్రామ ప్రజలందరికీ శాంతి, సుభిక్షాలు కలగాలని ప్రార్థించారు. ఈ సందర్భంగా గ్రామస్తులందరికీ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు.కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని మహోత్సవాన్ని విజయవంతం చేశారు.


Comments