ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

ఘనంగా రంజాన్ పండుగ వేడుకలు

– ముస్లిం సోదరులతో కలసి వేడుకల్లో పాల్గొన్న మాజీ మేయర్ బొంతు రాంమోహన్

– బాజీ బాషా నివాసంలో పండుగ శుభాకాంక్షలుj

చర్లపల్లి, మార్చి 21 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గంలో రంజాన్ (ఈద్-ఉల్-ఫితర్) పండుగ వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించబడ్డాయి. నెల రోజుల పాటు ఉపవాస దీక్షలు పాటించిన ముస్లిం సోదరులు ఈద్గాల వద్ద ప్రత్యేక నమాజులు నిర్వహించి ఆనందంగా పండుగ జరుపుకున్నారు.ఈ సందర్భంగా మాజీ మేయర్ బొంతు రాంమోహన్ ముస్లిం సోదరుల ఇళ్లకు వెళ్లి పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బాజీ బాషా నివాసాన్ని సందర్శించిన ఆయన, స్థానికులతో కలసి పండుగ ఆనందాన్ని పంచుకున్నారు.రంజాన్ పండుగ క్రమశిక్షణ, సేవాభావానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. అలాగే సామాజిక ఐక్యతకు ఇది మంచి ఉదాహరణగా నిలుస్తుందన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్లు బొంతు శ్రీదేవి యాదవ్, పజ్జూరి పావని మణిపాల్ రెడ్డి పాల్గొన్నారు. బాజీ బాషా కుటుంబ సభ్యులు మరియు స్థానికులు నేతలను సాదరంగా ఆహ్వానించి సత్కరించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం! సమైక్యతా సౌరభం.. రంజాన్ సంబరం!
ఖమ్మం బ్యూరో, మార్చి 21(తెలంగాణ ముచ్చట్లు) భారతీయ జీవన స్రవంతిలో అంతర్భాగమైన గంగా-జమునా తెహజీబ్‌కు నిలువుటద్దంగా, మత సామరస్యానికి మకుటాయమానంగా రంజాన్ పర్వదిన వేడుకలు శనివారం జిల్లా...
విద్యారంగానికి కేవలం 8.2% కేటాయింపు తీవ్ర అన్యాయం 
వనపర్తిలో ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన జిల్లెల్ల ఆదిత్య రెడ్డి
మత సామరస్యానికి ప్రతీకగా రంజాన్ వేడుకలు 
విద్యకు న్యాయం చేయాలంటూ ఎస్ఎఫ్ఐ హెచ్చరిక
మహిళా దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహణ
రంజాన్ సందర్భంగా ముస్లిం కుటుంబాలను కలిసిన ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి