కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ
Views: 15
On
కీసరగుట్ట, మార్చి 19 (తెలంగాణ ముచ్చట్లు):
ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని ప్రసిద్ధ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సంప్రదాయబద్ధంగా పల్లకి సేవ నిర్వహించారు.పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామివారిని ఆశీనులను చేసి, వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఈ పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ప్రముఖ శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
19 Mar 2026 22:04:33
హుజురాబాద్, మార్చి 19: (తెలంగాణ ముచ్చట్లు)
హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు ఉత్సవం ఆటపాటల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని...


Comments