కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ

కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ

కీసరగుట్ట, మార్చి 19 (తెలంగాణ ముచ్చట్లు): 

ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని కీసరగుట్టలోని ప్రసిద్ధ శ్రీ భవాని రామలింగేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఉగాది సందర్భంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించడం సాంప్రదాయంగా కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆలయ ఛైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారికి సంప్రదాయబద్ధంగా పల్లకి సేవ నిర్వహించారు.పుష్పాలతో అలంకరించిన పల్లకిలో స్వామివారిని ఆశీనులను చేసి, వేదమంత్రాల నడుమ మంగళ వాయిద్యాలతో ఊరేగింపుగా తీసుకెళ్లారు.
ఈ పల్లకి సేవలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసిపోగా ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది.కీసరగుట్ట శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయం తెలంగాణలో ప్రముఖ శివక్షేత్రంగా ప్రసిద్ధి చెందింది.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటపాటలతో కళకళలాడిన కొత్తపల్లి బోనాలు ఆటపాటలతో కళకళలాడిన కొత్తపల్లి బోనాలు
హుజురాబాద్, మార్చి 19: (తెలంగాణ ముచ్చట్లు)  హుజురాబాద్ మండలంలోని కొత్తపల్లి గ్రామంలో పోచమ్మ బోనాలు ఉత్సవం ఆటపాటల నడుమ ఘనంగా నిర్వహించారు. గ్రామస్తులు పెద్దఎత్తున పాల్గొని అమ్మవారిని...
జీవిత పోరాటంలో ఓడిపోయిన యువకుడు
మంత్రి పొన్నం ప్రభాకర్ చేతుల మీదుగా క్యాలెండర్ ఆవిష్కరణ
కాప్రా డీసికి మొరపెట్టుకున్నా స్పందన లేదని ప్రజలు ఆవేదన
కుషాయిగూడలో మహిళ అదృశ్యం
కీసరగుట్టలో ఘనంగా భవాని రామలింగేశ్వర స్వామి పల్లకి సేవ
విద్యావంతులైన కార్మికులకు అవకాశాలు కల్పిస్తాం