అమావాస్య సందర్భంగా కీసరగుట్టలో అన్నాభిషేకం నిర్వహణ
Views: 10
On
కీసరగుట్ట, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా కీసర డివిజన్–1 పరిధిలోని ప్రసిద్ధ కీసరగుట్టలో శ్రీ భవాని శివ దుర్గా సమేత రామలింగేశ్వర స్వామి ఆలయంలో అమావాస్య సందర్భంగా ప్రత్యేక అన్నాభిషేకం కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.ఆలయ చైర్మన్ తటాకం వెంకటేష్ శర్మ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద మంత్రోచ్చారణల నడుమ పూజారులు స్వామివారికి అన్నాభిషేకం నిర్వహించారు.అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. భక్తిశ్రద్ధలతో నిర్వహించిన ఈ కార్యక్రమం ఆధ్యాత్మిక వాతావరణంలో భక్తులకు ప్రత్యేక అనుభూతిని కలిగించింది.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
18 Mar 2026 21:25:17
జమ్మికుంట టౌన్, మార్చి 18 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మున్సిపల్ నూతన పాలకవర్గం ఏర్పాటైన నేపథ్యంలో పట్టణంలో పనిచేస్తున్న పారిశుద్య కార్మికులతో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్...


Comments