వేలేరు ZPHSలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

వేలేరు ZPHSలో విద్యార్థినులకు సైకిళ్ల పంపిణీ

వేలేరు, మార్చ్ 17 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) శాఖ వారు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ (CSR) కింద 6వ నుండి 9వ తరగతి వరకు చదువుతున్న క్లాస్ టాపర్ బాలికలకు సైకిళ్లు మరియు ఇతర వస్తువులతో కూడిన కిట్‌లను పంపిణీ చేశారు.
ఈ కార్యక్రమంలో వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి, SBI బ్యాంక్ మేనేజర్ గౌరవ శ్రీ కుమారస్వామి విద్యార్థినులకు సైకిళ్లను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ, రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన 480 పాఠశాలలలో 10 పాఠశాలల్లో మన పాఠశాల ఎంపిక కావడం మేనేజర్ కృషికి నిదర్శనమని అభినందించారు. విద్యార్థులు చదువులో మరింత రాణిస్తే భవిష్యత్తులో ఇలాంటి ప్రోత్సాహకాలు మరింతగా అందిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు సత్తయ్యతో పాటు ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

తెలంగాణలో బంజారాలకు అన్యాయం  తెలంగాణలో బంజారాలకు అన్యాయం 
హన్మకొండ,మార్చి17(తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణలో బంజారాలకు అన్యాయం జరిగిందని ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు మోహన్ సింగ్, ప్రధాన కార్యదర్శి బస్కి నాయక్...
జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యుడు జాటోత్ హుస్సేన్ నాయక్‌కు పితృవియోగం
సత్తుపల్లి బార్ అసోసియేషన్‌కు నూతన కమిటీ.!
వరి పంటలో తాలు గింజలు… రైతులకు గట్టి దెబ్బ.
బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలి 
చిలుకటోనిపల్లి వాగులో రాత్రివేళ అక్రమ ఇసుక రవాణా
పామిరెడ్డిపల్లిలో రంజాన్ ఇఫ్తార్ విందు – సర్వమత సామరస్యానికి నిదర్శనం