ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలి.
దమ్మపేట తహశీల్దార్కు బీజేపీ నాయకుల వినతిపత్రం.
దమ్మపేట, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ప్రకటించిన ఆరు గ్యారెంటీలను వెంటనే అమలు చేయాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం దమ్మపేట మండల అధ్యక్షులు పల్లపు వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో స్థానిక తహశీల్దార్కు వినతిపత్రం సమర్పించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తప్పనిసరిగా నెరవేర్చాలని, ప్రజా సమస్యల పరిష్కారం కోసం బీజేపీ ఎల్లప్పుడూ పోరాటం కొనసాగిస్తుందని ఈ సందర్భంగా నాయకులు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉడుతనేని విశ్వేశ్వరరావు, గూడ ముత్యాలరావు, తంబళ్ల రవి, మండల ప్రధాన కార్యదర్శి పసుపులేటి నాగరాజు, మండల ఉపాధ్యక్షురాలు కారం రత్నకుమారి, మహిళా మండల అధ్యక్షురాలు కొమ్మినపల్లి రజిత, ఎస్టిం మోర్చా మండల అధ్యక్షులు కొరస వీరభద్రం
, ఎస్సి మోర్చా మండల అధ్యక్షులు సొరకాయల సీతారాములు, మైనార్టీ మోర్చా నాయకులు ఎస్.కే. బాజీ, గంగిశెట్టి ప్రసాద్, పల్లపు శిరీష తదితరులు పాల్గొన్నారు.


Comments