జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణికి సత్కారం.
విశ్వశాంతి విద్యాలయంలో ఘనాభినందన.
సత్తుపల్లి, మార్చి 16 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండలం కాకర్లపల్లి గ్రామానికి చెందిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ క్రీడాకారిణి కొలపనేని గగనశ్రీని సోమవారం విశ్వశాంతి విద్యాలయంలో ఘనంగా సత్కరించారు. ఇటీవల ఒడిశా రాష్ట్రంలోని భువనేశ్వర్లో నిర్వహించిన జాతీయ స్థాయి బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో అండర్–17 విభాగంలో నాలుగో స్థానం సాధించడం ద్వారా ఆమె ప్రతిభను చాటుకున్నారు.
గత సంవత్సరం విశ్వశాంతి విద్యాలయంలో 10వ తరగతి పూర్తి చేసిన గగనశ్రీ తన పాఠశాలకు విచ్చేసిన సందర్భంగా ప్రిన్సిపాల్ పసుపులేటి నాగేశ్వరరావు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కలిసి ఆమెను అభినందించి సత్కరించారు.
ఈ సందర్భంగా గగనశ్రీ మాట్లాడుతూ, ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో జరిగిన రాష్ట్రస్థాయి బ్యాడ్మింటన్ పోటీలలో అండర్–17 విభాగంలో సింగిల్స్, మిక్స్డ్ డబుల్స్ విభాగాల్లో రెండు బంగారు పతకాలు సాధించడం ద్వారా జాతీయ స్థాయి పోటీలకు అర్హత సాధించినట్లు తెలిపారు. ఒడిశాలో జరిగిన ఆల్ ఇండియా స్థాయి పోటీలలో నాలుగో స్థానం పొందడం ఆనందంగా ఉందన్నారు. భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయిలో రాణించాలనే లక్ష్యంతో నిరంతరం సాధన కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గగనశ్రీతండ్రి అనిల్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. 



Comments