హెచ్ఎంటి నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

హెచ్ఎంటి నగర్‌లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు

_సుమారు 70 మంది మహిళలకు సన్మానం

– మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్

నాచారం, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):

అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 70 మంది మహిళలను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మహిళల సేవలను గుర్తిస్తూ వారికి జ్ఞాపికలు, బహుమతులను మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి రంగంలోనూ మహిళలు ముందుకు వచ్చి విశేష విజయాలు సాధిస్తున్నారని అన్నారు.మహిళలకు సమాజంలో మరింత గౌరవం, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అనంతరం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులు, కాలనీ మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రావూఫ్ సార్, శ్రీనివాస్, మధు, స్వామి రాజు, వెలన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!