హెచ్ఎంటి నగర్లో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు
_సుమారు 70 మంది మహిళలకు సన్మానం
– మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు):
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని హెచ్ఎంటి నగర్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీలో కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి నాచారం డివిజన్ మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కాలనీలోని సుమారు 70 మంది మహిళలను కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు ఘనంగా సన్మానించారు. మహిళల సేవలను గుర్తిస్తూ వారికి జ్ఞాపికలు, బహుమతులను మాజీ కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ చేతుల మీదుగా అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలు సమాజ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నారని, ప్రతి రంగంలోనూ మహిళలు ముందుకు వచ్చి విశేష విజయాలు సాధిస్తున్నారని అన్నారు.మహిళలకు సమాజంలో మరింత గౌరవం, అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని తెలిపారు.అనంతరం కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన భోజన కార్యక్రమంలో ముఖ్య అతిథులు, కాలనీ మహిళలు మరియు స్థానికులు పాల్గొన్నారు.ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు రావూఫ్ సార్, శ్రీనివాస్, మధు, స్వామి రాజు, వెలన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


Comments