మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో 40 ఆరోగ్య మిత్ర పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

_మార్చి 11 నుంచి 16 వరకు దరఖాస్తుల స్వీకరణ 

– డీఎంహెచ్‌ఓ డా. ఉమా గౌరి

మేడ్చల్ – మల్కాజిగిరి, మార్చి 10 ( తెలంగాణ ముచ్చట్లు):

జిల్లాలో ఆరోగ్య సేవలను మరింత బలోపేతం చేయడానికి ఫీల్డ్ ఆపరేషన్స్‌లో ఖాళీగా ఉన్న ఆరోగ్య మిత్ర పోస్టులను భర్తీ చేయడానికి అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి డా. సి. ఉమా గౌరి తెలిపారు. ఎంపికైన అభ్యర్థులను హైదరాబాద్‌లోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ (టిమ్స్), సనత్‌నగర్‌లో విధులు నిర్వహించేందుకు నియమించనున్నట్లు పేర్కొన్నారు.మొత్తం 40 ఆరోగ్య మిత్ర పోస్టులను ఔట్‌సోర్సింగ్ విధానంలో భర్తీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గ్రాడ్యుయేషన్‌తో పాటు డీసీఏ అర్హత కలిగి ఉండాలి. అలాగే కనీసం రెండు సంవత్సరాల అనుభవం ఉండాలని వెల్లడించారు. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా స్థానిక అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులని స్పష్టం చేశారు.అర్హత గల అభ్యర్థులు మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని పూర్తి చేసి సమర్పించాలి. దరఖాస్తులను మార్చి 11, 12, 13 మరియు 16 తేదీలలో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు స్వీకరించనున్నట్లు తెలిపారు.పూర్తి చేసిన దరఖాస్తులను జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి కార్యాలయం (డిఎం&హెచ్ఓ కార్యాలయం), ఎఫ్1, ఐడిఓసి, అంతాయిపల్లి, మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తుతో పాటు విద్యార్హత, అనుభవ సర్టిఫికెట్ల జిరాక్స్ ప్రతులు మరియు రూ.500 డిమాండ్ డ్రాఫ్ట్‌నుజిల్లా  వైద్య & ఆరోగ్య అధికారి, మేడ్చల్-మల్కజ్గిరి జిల్లా” పేరిట జతచేయాలని తెలిపారు.అర్హత గల స్థానిక అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డా. ఉమా గౌరి సూచించారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్ ఉప్పల్–కీసరలో వరుస చోరీలు ముగ్గురు అరెస్ట్
కీసర, మార్చి 10 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని కీసర సర్కిల్ పరిధిలో ఇళ్లలో వరుసగా జరుగుతున్న చోరీల కేసులను పోలీసులు ఛేదించారు. ఈ కేసుల్లో ప్రమేయం...
నీళ్ల కోసం రోడ్డు ఎక్కిన మహిళలు.
సింగరేణి సత్తుపల్లిలో మహిళా దినోత్సవ వేడుకలు.
క్విస్ట్ టాలెంట్ సెర్చ్ ఓలంపియాడ్ లో  ప్రతిభ కనబర్చిన కృష్ణవేణి టాలెంట్ స్కూల్ విద్యార్థులు 
మహనీయుల జయంతి ఉత్సవ కమిటీ ప్రకటన కోసం మార్చి 14న సమావేశం 
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను కలిసిన ఎంపీ డా. కడియం కావ్య
కూల్చిన చోటే మళ్లీ ‘అక్రమం’!