పదవ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ
Views: 61
On
వేలేరు, మార్చ్ 09 (తెలంగాణ ముచ్చట్లు):
పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో వేలేరు పోలీసుల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు ఎస్.ఐ సురేష్ కుమార్ ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు పరీక్షలను భయపడకుండా ధైర్యంగా ఎదుర్కొని కష్టపడి చదివితే మంచి ఫలితాలు సాధించవచ్చని సూచించారు. ఒత్తిడికి లోనవకుండా సమయాన్ని సక్రమంగా వినియోగించుకుని చదువుపై దృష్టి పెట్టాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, పోలీస్ సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments