15వ బెటాలియన్లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.
Views: 12
On
సత్తుపల్లి, మార్చి 2 (తెలంగాణ ముచ్చట్లు):
స్థానిక మండల పరిధిలోనీ బి.గంగారం గ్రామం 15వ బెటాలియన్ ప్రాంగణంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్ కమాండెంట్ ఎ.అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1984లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసి, అనంతరం శాసనసభ స్పీకర్గా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికి గౌరవం తీసుకువచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ దళాధిపతులు ఎస్.శ్రీధర్ రాజా, బి.వేణుగోపాలరెడ్డి, పరిపాలన అధికారి అశోక్, ఆర్ఐ పి.ఉదయ్కుమార్, ఆర్ఎస్ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
02 Mar 2026 21:25:07
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు)
ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు....


Comments