15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.

15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.

సత్తుపల్లి, మార్చి 2 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక మండల పరిధిలోనీ బి.గంగారం గ్రామం 15వ బెటాలియన్ ప్రాంగణంలో మాజీ శాసనసభ స్పీకర్ దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బెటాలియన్ కమాండెంట్ ఎ.అంజయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 1984లో కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన శ్రీపాదరావు మూడుసార్లు ఎమ్మెల్యేగా ప్రజాసేవ చేసి, అనంతరం శాసనసభ స్పీకర్‌గా బాధ్యతలు నిర్వహించి ఆ పదవికి గౌరవం తీసుకువచ్చారని తెలిపారు. ఆయన ఆశయాలను స్ఫూర్తిగా తీసుకుని పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సహాయ దళాధిపతులు ఎస్.శ్రీధర్ రాజా, బి.వేణుగోపాలరెడ్డి, పరిపాలన అధికారి అశోక్, ఆర్‌ఐ పి.ఉదయ్‌కుమార్, ఆర్‌ఎస్‌ఐలు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.IMG-20260302-WA0098

Tags:

Post Your Comments

Comments

Latest News

టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన టిబిజేఏ జిల్లా అధ్యక్షుడు సామ్రాట్ గుప్తాను పరామర్శించిన
ఖమ్మం బ్యూరో, మార్చి 2(తెలంగాణ ముచ్చట్లు) ఖమ్మం జిల్లా బీజేపీ కోశాధికారి  కొణతం లక్ష్మీనారాయణ టిబీజేఏ జిల్లా అధ్యక్షుడు వందనపు సామ్రాట్ గుప్తాను ఆయన స్వగృహంలో పరామర్శించారు....
అధికారికంగా దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి
మణిగిళ్ల ఉన్నత పాఠశాల వార్షికోత్సవానికి జిల్లా కలెక్టర్‌కు ఆహ్వానం
15వ బెటాలియన్‌లో దుద్దీల్ల శ్రీపాదరావు జయంతి.
స్మార్ట్ కిడ్జ్ లో ఆనందోత్సవాలతో హోలీ సంబురాలు
డాక్టర్ కాపా చంద్రకళను  సన్మానించిన లయన్స్ క్లబ్ జిల్లా  320ఈ గవర్నర్..
పేదల గుడిసెల కూల్చివేత అమానుషం