ఎస్సీ కాలనీలో నూతన త్రాగు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

ఎస్సీ కాలనీలో నూతన త్రాగు నీటి పైప్‌లైన్ పనులకు శ్రీకారం

వేలేరు, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

వేలేరు మండలం పీచర గ్రామంలో వచ్చే వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని ఎస్సీ కాలనీలో ప్రజలకు త్రాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టారు. మంచి నీళ్ల బావి నుంచి వాటర్ ట్యాంక్ వరకు నూతన పైప్‌లైన్ పనులను సర్పంచ్ మరిజే అనిత నరసింహారావు ప్రారంభించారు.
వేసవిలో నీటి కొరత లేకుండా నిరంతరాయంగా సరఫరా చేయాలనే ఉద్దేశంతో ఈ పనులు చేపట్టినట్లు ఆమె తెలిపారు. పనులు త్వరితగతిన పూర్తి చేసి కాలనీ ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ గుడికందుల ప్రశాంత్, వార్డు సభ్యులు గుడికందుల రాకేష్, జెరుపోతుల జగన్, రామంచ ప్రశాంత్, ఎస్సీ కాలనీ అధ్యక్షుడు ఏలూరి కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260301-WA0037

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .