పోలీస్ శిక్షణ కేంద్రంలో ఫిల్లింగ్ స్టేషన్ ను ప్రారంభించిన డి జి పి
కాజీపేట్ మార్చి 1 (తెలంగాణ ముచ్చట్లు)
కాజీపేట్ మండలం మడికొండ లోని జిల్లాపోలీస్ శిక్షణ కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఇండియన్ ఆయిల్ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ శివధర్ రెడ్డి ప్రారంభించారు. వాహనాల నిర్వహణలో సౌలభ్యం కల్పించడం మే లక్ష్యంగా పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్ను ఏర్పాటు చేసినట్లు పోలీసులు తెలిపారు. వరంగల్ కమిషనరేట్ పరిధిలో వివిధ పోలీస్ స్టేషన్లను అధికారిక వాహనాల ఇంధన అవసరాలను ఈ ఫీలింగ్ స్టేషన్ ద్వారా సకాలంలో నాణ్యమైన సేవలను అందించనున్నట్లు వారు తెలిపారు. ఇంధన సరఫరాలో పారదర్శకత సమయపాలన సమర్థవంతమైన నిర్వహణకు ప్రాధాన్యమిస్తామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ సెంట్రల్ జోన్ డీసీపీ కవిత, అంకిత్ కుమా,ర్ ఎస్ పి శుభం, అదనపు ఏసీపీలో సురేష్ కుమార్, శ్రీనివాస్, ఎసిపి ప్రశాంత్ రెడ్డి, అంతయ్య, సురేంద్ర లతోపాటు ఇండియన్ ఆయిల్ కు సంబంధించిన సిబ్బంది పాల్గొన్నారు.


Comments