మాణిక్యమాయ్య గుట్టపై శ్రీ మల్లికార్జున స్వామి రేణుక ఎల్లమ్మ జాతర
పాల్గొన్న ఎంపీ ఈటల రాజేందర్
మేడ్చల్–మల్కాజ్గిరి, మార్చ్ 01 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని కాచవాని సింగారం గ్రామంలోని మాణిక్యమాయ్య గుట్టపై నిర్వహించిన శ్రీ మల్లికార్జున స్వామి మరియు రేణుక ఎల్లమ్మ జాతర భక్తిశ్రద్ధల మధ్య ఘనంగా జరిగింది. ఈ జాతర కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడు ఈటల రాజేందర్ హాజరయ్యారు.ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం గ్రామ పెద్దలు, దేవస్థానం కమిటీ సభ్యులు ఎంపీకి సన్మానం చేసి శాలువాతో సత్కరించారు. భక్తులతో కలిసిమెలిసి జాతర వేడుకల్లో పాల్గొన్న ఎంపీ, గ్రామ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు.గ్రామాల అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం పలు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నదని, వాటి ప్రయోజనాలు ప్రతి కుటుంబానికి అందేలా కృషి చేస్తామని ఆయన పేర్కొన్నారు. గ్రామ దేవతల ఆశీర్వాదాలతో ప్రాంతం అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు.జాతర సందర్భంగా పెద్ద సంఖ్యలో భక్తులు గుట్టపైకి చేరుకుని మొక్కులు తీర్చుకున్నారు. భజనలు, అन्नదానం, సాంప్రదాయ కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి. ఎటువంటి అవాంఛనీయ
ఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు భద్రతా ఏర్పాట్లు చేశారు.


Comments