ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు

ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు

_ కీసర డివిజన్-1లో లబ్ధిదారులకు ప్రొసీడింగ్ కాపీల పంపిణీ
_రూ.5 లక్షల ఆర్థిక సాయంతో పేదలకు సొంతింటి కల సాకారం

కీసర, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు)

మేడ్చల్ నియోజకవర్గం జిహెచ్ఎంసి మల్కాజ్గిరి కీసర సర్కిల్ కీసర డివిజన్-1 పరిధిలో ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల గృహప్రవేశ వేడుకలు ఘనంగా నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమానికి సీనియర్ మాజీ మండల్ వర్కింగ్ అధ్యక్షులు రామిడి విజయ్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, పెడుచుట్టి సదానందం నూతన ఇందిరమ్మ ఇల్లు గృహప్రవేశాన్ని ప్రారంభించారు.అదేవిధంగా తోకటి పద్మకు ఇందిరమ్మ ఇల్లు ప్రొసీడింగ్ కాపీని అందజేశారు.ఈ సందర్భంగా విజయ్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి  రేవంత్ రెడ్డి నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం పేదల సంక్షేమాన్ని ప్రధాన లక్ష్యంగా తీసుకుని “ఇందిరమ్మ ఇళ్లు” పథకాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి అర్హులైన కుటుంబానికి సొంత స్థలంలో ఇల్లు నిర్మించుకునేందుకు రూ.5 లక్షల ఆర్థిక సహాయం అందజేస్తోందని తెలిపారు.గతంలో ఇందిరా గాంధీ పేదల కోసం చేపట్టిన గృహ నిర్మాణ కార్యక్రమాల స్ఫూర్తితోనే ఈ పథకం కొనసాగుతోందని పేర్కొన్నారు. ప్రతి కుటుంబానికి ఆత్మగౌరవంతో కూడిన నివాసం కల్పించడమే ప్రభుత్వ సంకల్పమని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రాజలింగం గౌడ్, సురేష్ గౌడ్, బండారి ఇలేష్, తాళ్ల భాగ్యమ్మ, తోకటి లలిత, మాజీ సర్పంచ్ యాదయ్య, కుమార్, అంజనయులు, సంతోష్ గౌడ్, సత్యనారాయణ, భికపతి, జిహెచ్ఎంసి కీసర డివిజన్-1 ఇందిరమ్మ కమిటీ సభ్యులు, సీనియర్ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.IMG-20260227-WA0091

Tags:

Post Your Comments

Comments

Latest News

రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’ రాష్ట్రంలోనే తొలిసారి ‘ఇందిరమ్మ–రేవంత్ రెడ్డి కాలనీ’
- కొత్తూరులో 67 ఇళ్లతో సామూహిక గృహప్రవేశాలు.- పైలెట్ ప్రాజెక్ట్‌గా ఎంపిక చేసి ఆధునిక వసతులతో నిర్మాణం. సత్తుపల్లి, ఫిబ్రవరి 27 (తెలంగాణ ముచ్చట్లు):  సత్తుపల్లి మండలం...
ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశ వేడుకల్లో రామిడి విజయ్ రెడ్డి పాల్గొన్నారు
విప్లవ వీరుడు చంద్రశేఖర్ ఆజాద్ 95వ వర్ధంతి సందర్భంగా సంస్మరణ సభ
చికిత్స పొందుతూ ప్రమీల రాణి మృతి
గ్రామీణాభివృద్ధి–మహిళా సాధికారతకు ప్రాధాన్యం.
న్యాయవాదుల రక్షణకు ప్రత్యేక చట్టం అవసరం
మానవ మనుగడకు సైన్స్ కీలకం: ఎమ్మెల్యే మట్టా రాగమయి.