కన్నారం గ్రామంలో అక్రమ ఇసుక రవాణా అడ్డుకున్న పోలీసులు – ట్రాక్టర్ స్వాధీనం
Views: 5
On
వేలేరు, ఫిబ్రవరి 25 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం కన్నారం గ్రామంలో అక్రమంగా ఇసుక తరలిస్తున్న వాహనాన్ని మరియు వ్యక్తిని వేలేరు పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గ్రామంలో పెట్రోలింగ్ నిర్వహిస్తున్న సమయంలో ఎలాంటి అనుమతులు లేకుండా చెవుల లింగయ్య (35)అనే వ్యక్తి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక రవాణా చేస్తుండగా గుర్తించారు.
ఈ సందర్భంగా TS 01 UC5843 నంబర్ గల ఇసుక లోడుతో వున్న ట్రాక్టర్ను పోలీసులు స్వాధీనం చేసుకుని డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు వేలేరు ఎస్సై అజ్మీరా సురేష్ తెలిపారు.
అక్రమ ఇసుక రవాణాపై కఠిన చర్యలు తీసుకుంటామని, ఇలాంటి కార్యకలాపాలు జరిపితే చట్టపరమైన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
25 Feb 2026 21:46:27
ఉద్యమకారుల సంక్షేమానికి పెద్దపీట వేసిన రేవంత్ రెడ్డి ఇంకా పదేళ్లు సిఎంగా కొనసాగుతారు
– తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి
హైదరాబాద్,ఫిబ్రవరి25(తెలంగాణ ముచ్చట్లు):...


Comments