రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!

సీతారామ ప్రాజెక్ట్ ప్యాకేజీ-6 కాలువకు భూమిపూజ.

రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!

సత్తుపల్లి, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

సత్తుపల్లి నియోజకవర్గం పెనుబల్లి మండలం రామచంద్రపురం గ్రామంలో సీతారామ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు డిస్ట్రిబ్యూటరీ ప్యాకేజీ–6 కాలువ పనులకు ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదివారం భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఈ కాలువ పనులు పూర్తయితే రామచంద్రపురం సహా పరిసర ప్రాంతాల రైతుల సాగునీటి సమస్యలు తొలగిపోతాయని పేర్కొన్నారు. పనులను నాణ్యతతో, వేగంగా పూర్తి చేయాలని అధికారులకు, కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులకు సూచించారు. కార్యక్రమంలో రామచంద్రపురం సర్పంచ్ రిజ్వాన కరిముల్లా, పెనుబల్లి మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పంది వెంకటేశ్వరరావు, ఎంఆర్వో, ఎంపీడీఓలు పాల్గొన్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ, ఈఈ, డీఈ, జేఈ అధికారులు, కేఎన్ఆర్ సంస్థ ప్రతినిధులు హాజరయ్యారు. మండల నాయకులు, రైతులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సాగునీటి వసతి కల్పిస్తున్నందుకు రైతులు ఎమ్మెల్యేకు కృతజ్ఞతలు తెలిపారు.IMG-20260222-WA0036

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం