ఈసీఐఎల్ ఎక్స్ రోడ్‌లో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం

ఈసీఐఎల్ ఎక్స్ రోడ్‌లో “అరైవ్ అలైవ్” అవగాహన కార్యక్రమం

కుషాయిగూడ, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

 రోడ్డు ప్రమాదాల నివారణ లక్ష్యంగా “అరైవ్ అలైవ్ క్యాంపెయిన్–2026” ఫేస్–2లో భాగంగా మల్కాజ్గిరి కమిషనరేట్ పరిధిలో కుషాయిగూడ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో ఈసీఐఎల్ ఎక్స్ రోడ్ వద్ద ప్రజలకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సబ్ ఇన్స్పెక్టర్ నిమ్మ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ వాహనదారులు తప్పనిసరిగా లేన్ డిసిప్లిన్ పాటించాలని, అనవసర ఓవర్‌టేకింగ్ చేయకూడదని సూచించారు. ట్రాఫిక్ నిబంధనలను కచ్చితంగా పాటించడం ద్వారా రోడ్డు ప్రమాదాలు, ప్రాణనష్టం గణనీయంగా తగ్గించవచ్చని తెలిపారు. హెల్మెట్, సీట్ బెల్ట్ వినియోగంపై కూడా ప్రజలకు అవగాహన కల్పించారు.దాదాపు 50–60 మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎస్ఐపి కే. సతీష్ మరియు ఇతర పోలీసు సిబ్బంది కార్యక్రమంలో పాల్గొన్నారు.ప్రజల భాగస్వామ్యం తో రోడ్డు ప్రమాదాలు మరియు మరణాలను తగ్గించే లక్ష్యంతో 22.02.2026 నుండి 28.02.2026 వరకు (ఏడు రోజుల పాటు) “అరైవ్ అలైవ్” రెండో దశ కార్యక్రమం నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.IMG-20260222-WA0067

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం