కీసరలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం

రాజ్యాంగ ఫలాలు అందరికీ అందేలా చూడడమే నిజమైన నివాళి: డా. డి.బి. జ్యోతి

కీసరలో అంబేద్కర్ జ్ఞానమాల కార్యక్రమం

కీసర, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు):

నవభారత రాజ్యాంగ నిర్మాత బి. ఆర్. అంబేద్కర్ దేశంలోని అణగారిన వర్గాలకు ఆశాజ్యోతి అని, ఆయన ఆశయ సాధనకు కట్టుబడి పనిచేయాలని కె.జె.ఆర్ చారిటబుల్ ట్రస్ట్ స్థాపకురాలు, సామాజిక కార్యకర్త డా. డి.బి. జ్యోతి పిలుపునిచ్చారు.కీసర సర్కిల్ దమ్మాయిగూడ డివిజన్ పరిధిలోని ఆర్‌జీకే కాలనీలో ఆటో స్టాండ్ ప్రాంగణంలో అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహిస్తున్న “అంబేద్కర్ జ్ఞానమాల” కార్యక్రమంలో భాగంగా ఈ ఆదివారం జరిగిన 4వ జ్ఞానమాల కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా బి. ఆర్. అంబేద్కర్ మరియు జగ్జీవన్ రామ్  విగ్రహాలకు జ్ఞానమాల సమర్పించి నివాళులర్పించారు.అనంతరం మాట్లాడిన ఆమె, నేడు ప్రజలు అనుభవిస్తున్న హక్కులు, అవకాశాలు అన్నీ అంబేద్కర్ రచించిన రాజ్యాంగ ఫలాలేనని తెలిపారు. ఆకలి, అసమానతలు లేని సమసమాజ స్థాపన కోసం ఆయన అహర్నిశలు కృషి చేసి సామాజిక న్యాయం సాధించారని కొనియాడారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లడమే ఆయనకు ఇచ్చే అసలైన నివాళి అని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఈగ శ్వేతా రాజు ముదిరాజ్, మాజి కౌన్సిలర్ మంగళపూరి వెంకటేష్, అంబేద్కర్ సంఘం అధ్యక్షుడు గొల్లూరి రాజు, ప్రధాన కార్యదర్శి వుల్లి సురేష్ ముదిరాజ్, ఉపాధ్యక్షులు పులిపాక తిరుపతి, ఈగరాజు ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి కోదండరాంను కలిసిన ఫోరం నేతలు
హైదరాబాద్, ఫిబ్రవరి 22 (తెలంగాణ ముచ్చట్లు): తెలంగాణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరుతూ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్...
మంత్రి పొంగులేటిని మర్యాదపూర్వకంగా కలిసిన సత్తుపల్లి, కల్లూరు మున్సిపల్ ప్రజాప్రతినిధులు
కలకాలం కలిసి ఉండాలి...
వార్డుల్లో తిరగండి.. సమస్యలు తీర్చండి!
ట్రస్మా డివిజన్ బాధ్యులకు సత్కారం.
రామచంద్రపురంలో సాగునీటి పనులకు శ్రీకారం.!
ఇందిరమ్మ గృహాలతో నిరుపేదల సొంతింటి కల సాకారం