మాతృభాషపై ప్రతి ఒక్కరూ మమకారం పెంచుకోవాలి
జిల్లా సాహితీ కళావేదిక అధ్యక్షులు పలుస శంకర్ గౌడ్
వనపర్తి,ఫిబ్రవరి21(తెలంగాణ ముచ్చట్లు):
ప్రతి ఒక్కరూ మాతృభాషపై మమకారం పెంచుకోవాలని సాహితీ కళావేదిక వనపర్తి జిల్లా అధ్యక్షుడు పలుస శంకర్ గౌడ్ పిలుపునిచ్చారు.అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవాన్ని పురస్కరించుకుని కళావేదిక ఆధ్వర్యంలో తెలుగు భాషకు సేవలందించిన పలువురు సాహితీవేత్తలను ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా శంకర్ గౌడ్ మాట్లాడుతూ..ఉపాధి అవకాశాల కోసం పరాయి భాషలను ప్రోత్సహించడం అవసరమే అయినప్పటికీ, ఇతర భాషలపై వ్యామోహంతో మాతృభాషను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదన్నారు. మాతృభాషల మనుగడకు ప్రమాదం తలెత్తకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతతో వ్యవహరించాలని సూచించారు. తల్లిదండ్రులు బాల్యం నుంచే తమ పిల్లలకు మాతృభాషపై ఆసక్తి, గౌరవం పెంపొందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో సందాపురం బిచ్చయ్య, కందూరు నారాయణ రెడ్డి, జనజ్వాల, కొత్తకాపు నారాయణ రెడ్డి, మందాపురం సుజాతమ్మ, ఎం.ఏ. సత్తార్ తదితరులను శాలువాలతో సత్కరించారు.కార్యక్రమంలో బైరోజు చంద్రశేఖర్, బెల్లంపల్లి శ్రీనివాసులు, బండారు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.


Comments