కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో ఉద్రిక్తత

కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తు చర్యగా ఈటల నివాసానికి చేరుకున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను ఇంటి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భం గా ఈటల అనుచరులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసుల చర్యపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా మరో ప్రజాప్రతినిధిని పరామర్శించడానికి వెళ్లడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని విమర్శించారు.అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, ప్రజల మద్దతుతో తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్,మే 24(తెలంగాణ ముచ్చట్లు ): ప్రస్తుతం మండుతున్న ఎండలు, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా పొలాల్లో వరి కోయ్యలు, గడ్డి అవశేషాలు కాల్చడం వల్ల భారీ అగ్ని...
మరణానంతరం ఇద్దరికి చూపునిచ్చిన రావికంటి రాజయ్య నేత్రదానం.
మడిపల్లి అగ్నిప్రమాద బాధిత గౌడ కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి.
జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం : చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని
పేదరికం బలి తీసుకున్న మరో ప్రాణం.
అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను మరవొద్దు.