కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి ఇంటిపై దాడి నేపథ్యంలో ఉద్రిక్తత

కామారెడ్డికి వెళ్లనీయకుండా ఈటల రాజేందర్ హౌస్ అరెస్ట్

హైదరాబాద్, ఫిబ్రవరి 21 (తెలంగాణ ముచ్చట్లు):

మల్కాజిగిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్ ను పోలీసులు శనివారం హౌస్ అరెస్ట్ చేయడం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. కామారెడ్డి ఎమ్మెల్యే వెంకట రమణా రెడ్డి నివాసంపై జరిగిన దాడి ఘటనను తీవ్రంగా ఖండించిన ఈటల రాజేందర్, ఆయన్ను పరామర్శించేందుకు కామారెడ్డి వెళ్లేందుకు సిద్ధమయ్యారు.ఈ సమాచారం అందుకున్న పోలీసులు ముందస్తు చర్యగా ఈటల నివాసానికి చేరుకున్నారు. ఏసీపీ ఆధ్వర్యంలో భారీగా పోలీసు బలగాలను మోహరించి, ఆయనను ఇంటి బయటకు రానీయకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భం గా ఈటల అనుచరులు పెద్ద ఎత్తున నివాసానికి చేరుకోవడంతో స్వల్ప ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకువచ్చారు.పోలీసుల చర్యపై ఈటల రాజేందర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజాప్రతినిధిగా మరో ప్రజాప్రతినిధిని పరామర్శించడానికి వెళ్లడాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని ఆయన పేర్కొన్నారు.రాజకీయ కక్ష సాధింపులో భాగంగానే ఈ చర్యలు తీసుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం గుండాయిజానికి పాల్పడుతూ ప్రజాస్వామ్య విలువలను ఖూనీ చేస్తోందని విమర్శించారు.అన్యాయానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగిస్తామని, ప్రజల మద్దతుతో తగిన సమాధానం ఇస్తామని హెచ్చరించారు. మరోవైపు, శాంతిభద్రతల దృష్ట్యా ముందస్తు చర్యగా హౌస్ అరెస్ట్ చేసినట్లు పోలీసు వర్గాలు వెల్లడించాయి.ఈ ఘటనపై అధికార, ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతుండగా, రాష్ట్ర రాజకీయాల్లో ఉద్రిక్తత నెలకొంది.

Tags:

Post Your Comments

Comments

Latest News

జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం. జవహార్ నగర్‌లో యువకుడు అదృశ్యం.
_పనికి వెళ్లి వచ్చిన తర్వాత బయటకు వెళ్లి కనిపించని ప్రశాంత్…  _మిస్సింగ్ కేసు నమోదు జవహార్ నగర్, ఏప్రిల్ 7 (తెలంగాణ ముచ్చట్లు) మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా జవహార్...
కమిషన్ల కోసమే గొల్లపల్లి–చీర్కపల్లి రిజర్వాయర్.
బాలాజీ నగర్ లో ఆటో డ్రైవర్ అదృశ్యం
వనపర్తి ఎమ్మెల్యే చేతుల మీదగా కల్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ.
మోజర్లలో చలివేంద్రం ప్రారంభం.
ఈసీ నగర్‌లో సెల్ టవర్ వివాదం ఉద్రిక్తతకు దారి
జవహార్ నగర్ పిల్లల కోసం ప్రత్యేక డ్రైవ్