ఆకాశంలో అద్భుత దృశ్యం.
- సూర్యాస్తమయ వేళ రెండు రంగుల్లో మెరిసిన ఆకాశం.
- వాహనాలు ఆపి వీక్షించిన ప్రజలు.
దమ్మపేట, జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట పట్టణంలో శనివారం సాయంత్రం సూర్యాస్తమయ సమయంలో ఆకాశంలో అరుదైన, మనోహరమైన దృశ్యం ఆవిష్కృతమై స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. సాధారణ సూర్యాస్తమయ రంగులకు భిన్నంగా ఆకాశం రెండు భాగాలుగా విభజించబడినట్లు కనిపిస్తూ చూపరులను మంత్రముగ్ధులను చేసింది. ఒకవైపు లోతైన నీలం రంగులో ఆకాశం కనిపించగా, మరోవైపు నారింజ, గులాబీ రంగుల కాంతులు విరాజిల్లాయి. ఈ రెండు రంగుల మధ్య స్పష్టమైన సరిహద్దు కనిపించడం విశేషంగా నిలిచింది. ఆకాశంలో ఎవరో గీత గీసినట్లుగా కనిపించిన ఈ దృశ్యం పలువురిని ఆకట్టుకుంది. సాయంత్రం వేళ తమ పనుల నిమిత్తం రహదారులపై ప్రయాణిస్తున్న ప్రజలు ఈ అపురూప దృశ్యాన్ని చూసి వాహనాలను పక్కన నిలిపి ఆసక్తిగా వీక్షించారు. చాలామంది తమ మొబైల్ ఫోన్లలో ఫోటోలు, వీడియోలు చిత్రీకరించి సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి వైరల్గా మారాయి.


Comments