మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.

మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.

జమ్మికుంట టౌన్ జూన్ 14 (తెలంగాణ ముచ్చట్లు):

కరీంనగర్ జిల్లా జమ్మికుంట పట్టణానికి చెందిన గుండా సురేందర్ ఇటీవల గుండెపోటు, వడదెబ్బ కారణంగా మృతి చెందడంతో ఆయన కుటుంబాన్ని ఆదుకునేందుకు జమ్మికుంట జెడ్పీ ఉన్నత పాఠశాల 1983-84 పదవ తరగతి బ్యాచ్‌కు చెందిన బాల్యమిత్రులు ముందుకు వచ్చారు.

సురేందర్‌తో కలిసి విద్యాభ్యాసం చేసిన మిత్రులు తమ వంతు సహాయంగా రూ.1 లక్షలను సమకూర్చి ఆదివారం ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ మొత్తాన్ని మృతి చెందిన సురేందర్ కుమార్తె పేరుతో స్థిర నిక్షేపంగా జమ చేశారు.

ఈ సందర్భంగా మిత్రులు మాట్లాడుతూ, కష్టసుఖాల్లో పరస్పరం అండగా నిలవడం నిజమైన స్నేహానికి నిదర్శనమని పేర్కొన్నారు. "స్నేహమే జీవితం" అనే భావనతో తమ బృందం ఎల్లప్పుడూ ఐక్యంగా ఉంటుందని, సురేందర్ కుటుంబానికి భవిష్యత్తులో కూడా అండగా నిలుస్తామని భరోసా ఇచ్చారు.

ఈ కార్యక్రమంలో బాల్యమిత్రుల సేవాసమితి సభ్యులు మంద వెంకట్ రెడ్డి, కనుమల్ల గణపతి, ఆర్. సంపత్ కుమార్, పెంచలయ్య, కొక్కుల రాజేందర్, డి. రాజేందర్, సాంబయ్య, సమ్మయ్య, గుడిమల్ల బలరాం, ఎ. సంపత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం. కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల గంజాయి స్వాధీనం.
ఖమ్మం బ్యూరో, జూన్ 14(తెలంగాణ ముచ్చట్లు ) ఖమ్మం జిల్లా కొణిజర్ల మండలంలో కోటి రూపాయలకు పైగా విలువ చేసే 201 కిలోల ఎండు గంజాయిని పోలీసులు...
రక్తదానం మహాదానం.. వైద్యుల సూచనలతోనే రక్తదానం చేయాలి.
శాలపల్లి గ్రామంలో ప్రైవేట్ పాఠశాల బస్సుల ప్రవేశానికి నిషేధం.
మరణానంతరం కూడా మిత్రుడికి అండగా.. కుటుంబానికి లక్ష రూపాయల సహాయం.
రైతు సమస్యలపై సూరారంలో గర్జించిన రైతాంగం.
పాఠశాల పునఃప్రారంభానికి ముస్తాబు.. క్రీడా మైదానాల అభివృద్ధికి సర్పంచ్ ప్రత్యేక చొరవ.
బొడ్రాయి మహోత్సవానికి మాజీ జెడ్పీటీసీ రాజశేఖర్ రెడ్డి విరాళం.