పట్టణ అభివృద్ధికి వ్యాపార సంస్థలే బల.
హుజురాబాద్, జూన్ 12(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ పట్టణ అభివృద్ధికి వ్యాపార, వాణిజ్య సంస్థల విస్తరణ ఎంతో దోహదపడుతుందని హుజురాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ శ్రీమతి రొంటాల సుహాసిని మనోజ్రావు అన్నారు. పట్టణంలోని నూతనంగా ఏర్పాటు చేసిన బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, హుజురాబాద్ పట్టణం వేగంగా అభివృద్ధి చెందుతూ వాణిజ్య కేంద్రంగా రూపుదిద్దుకుంటోందన్నారు. ప్రముఖ సంస్థలు పట్టణంలో తమ శాఖలను ఏర్పాటు చేయడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు కూడా పెరుగుతాయని పేర్కొన్నారు. వినియోగదారులకు నాణ్యమైన ఉత్పత్తులు, ఉత్తమ సేవలు అందిస్తూ సంస్థ విజయవంతంగా ముందుకు సాగాలని ఆకాంక్షించారు.
బజాజ్ ఎలక్ట్రానిక్స్ ప్రారంభం హుజురాబాద్ వ్యాపార రంగానికి కొత్త ఉత్సాహాన్ని తీసుకువస్తుందని, స్థానిక ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి దోహదపడుతుందని ఆమె తెలిపారు. అనంతరం షోరూమ్లో ఏర్పాటు చేసిన వివిధ ఎలక్ట్రానిక్ ఉత్పత్తులను పరిశీలించి నిర్వాహకులను అభినందించారు.
ఈ కార్యక్రమంలో 17వ వార్డు కౌన్సిలర్ ఎండీ ఖలీక్, టౌన్ ప్రెసిడెంట్, కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధులు, వ్యాపారవేత్తలు, కార్యకర్తలు, స్థానిక ప్రముఖులు మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.
నూతన షోరూమ్ ప్రారంభంతో హుజురాబాద్ ప్రజలకు అత్యాధునిక ఎలక్ట్రానిక్ ఉత్పత్తులు అందుబాటులోకి రావడంతో పాటు పట్టణ వాణిజ్య రంగం మరింత విస్తరించనున్నదని పలువురు అభిప్రాయపడ్డారు.


Comments