గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది.

డిప్యూటీ కమిషనర్ విద్యా లత  .

గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది.

ఖమ్మం బ్యూరో, జూన్ 7(తెలంగాణ ముచ్చట్లు )

గ్రామ పంచాయతీ ల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో కృషి చేస్తుంది అని డిప్యూటీ కమిషనర్ విద్యాలత  అన్నారు. సోమవారం చింతకాని మండలం నేరడ గ్రామం లో నేరడ గ్రామ సర్పంచ్ దూసరి నేతాజీ అధ్యక్షతన జరిగిన ప్రత్యేక గ్రామ సభ లో తాను ముఖ్య అతిథి గా పాల్గొని మాట్లాడారు.99 రోజులు ప్రత్యేక ప్రణాళిక లో భాగంగా గత మూడు నెలలు గా  ప్రభుత్వం గ్రామాల అభివృద్ధి కి కృషి చేస్తుంది అన్నారు. డిప్యూటీ సీఎం  మధిర నియోజకవర్గం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అభివృద్ధి కార్యక్రమాలు  చేపడుతున్నారు అని  ఆమె కొనియాడారు. రానున్న కాలం లో  పింఛన్లు ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేసే దానికోసం ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో  జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ శ్రీనువాస్  చింతకాని ఎండీఓ శ్రీనివాస్ రావు, ఎంపీవో పర్వీనా మండల్ అధికారులు ఏ ఈ రఘు మండల ఆర్ ఐ శ్రీనివాస్ ఇతర మండల్ అధికారులు గ్రామ దీపికలు గ్రామ సెక్రటరీ,గ్రామ కాంగ్రెస్ అధ్యక్షులు మంకెన నాగేశ్వర్ రావు ఉపసర్పంచ్ బాల ఏసు వార్డ్ సభ్యులు డ్వాక్రా సంఘాల సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు .గ్రామ సభ అనంతరం జడ్పీఎస్ఎస్  స్కూల్ లో మొక్కలు నాటారు.అంతే గాకుండా గ్రామం లో నిర్మించ తలపెట్టిన నూతన వివో బిల్డింగ్ శంకుస్థాపన కార్యక్రమం లో పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి. గ్రామ సమస్యలపై అధికారుల నిర్లక్ష్యం వీడాలి.
మదనాపురం జూన్08(తెలంగాణ ముచ్చట్లు):  గ్రామ ప్రజలు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంలో గ్రామపంచాయతీ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని తెలంగాణ రాజ్యాధికార పార్టీ (టీఆర్‌పీ) వనపర్తి జిల్లా యూత్...
మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామికి కాంగ్రెస్ నాయకుల ఘన సన్మానం.
పార్టీ బలోపేతానికి బీఎల్ఏలు వారధులుగా పనిచేయాలి.
గ్రామాల అభివృద్ధి కోసం తెలంగాణ ప్రభుత్వం ఎంతో చేస్తుంది.
ప్రజా దర్బార్ లో వచ్చిన ప్రతి న్యాయబద్ధమైన సమస్యను పరిష్కరిస్తాం.
డ్రంక్ అండ్ డ్రైవ్‌పై ఎల్కతుర్తి పోలీసుల ఉక్కు పాదం.
అర్హులైన ప్రతి పేద కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు అందించడమే ప్రభుత్వ లక్ష్యం.