హనుమకొండకు బదిలీ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ మాలతికి ఆత్మీయ వీడ్కోలు.

8 ఏళ్ల సేవలకు గుర్తింపుగా ఘన సన్మానం.

హనుమకొండకు బదిలీ నేపథ్యంలో వెటర్నరీ డాక్టర్ మాలతికి ఆత్మీయ వీడ్కోలు.

భీమదేవరపల్లి, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు):

 హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండల కేంద్రంలోని పశువైద్యశాలలో గత 8 సంవత్సరాలుగా పశువైద్య అధికారిణిగా సేవలందించిన డాక్టర్ మాలతి హనుమకొండకు బదిలీ కావడంతో ఆమెకు ఘనంగా వీడ్కోలు కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా కొప్పూరు గ్రామ సర్పంచ్ గద్ద కుమారస్వామి, ఉపసర్పంచ్ మిరియాల రాణిరాజు, రైతులు, ప్రజాప్రతినిధులు కలిసి డాక్టర్ మాలతిని శాలువాతో సత్కరించి, జ్ఞాపిక అందజేశారు. పశుసంవర్ధక రంగ అభివృద్ధికి ఆమె అందించిన సేవలను కొనియాడుతూ, భవిష్యత్తులో మరిన్ని ఉన్నత స్థానాలు అధిరోహించాలని ఆకాంక్షించారు.

డాక్టర్ మాలతి మాట్లాడుతూ, భీమదేవరపల్లి మండల రైతులు, ప్రజలు తనకు అందించిన సహకారానికి కృతజ్ఞతలు తెలిపారు. ఇక్కడ పనిచేసిన కాలం తనకు ఎంతో సంతృప్తిని ఇచ్చిందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు, పశుపోషకులు, గ్రామ పెద్దలు మరియు పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం. గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం.
వేలేరు, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు): వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందం ఆదివారం రాత్రి...
భీమదేవరపల్లిలో బెల్ట్ షాపుల నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం.
గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం
రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు.. అనుమానితులపై పోలీసుల ప్రత్యేక నిఘా.
విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యంపై ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం.
పొదుపు మనిషికి ఆర్థిక స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని అందిస్తుంది.
రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.