రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.

రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.

జమ్మికుంట టౌన్ జూన్ 01 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణ పరిధిలోని ధర్మారం శివారు కొత్తపల్లి సబ్ స్టేషన్ నుంచి రామన్నపల్లి రైతులు వ్యవసాయ పనుల కోసం వినియోగించే రహదారిపై నెలకొన్న వివాదాన్ని పరిష్కరించేందుకు మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ స్థానిక ఎంఆర్వోతో కలిసి స్థలాన్ని పరిశీలించారు.

కొత్తపల్లి సబ్ స్టేషన్ పరిసరాల్లో ఎన్‌పీడీసీఎల్ అధికారులు గోడ నిర్మాణం చేపడుతున్న నేపథ్యంలో రైతులు తమకు ఉపయోగపడే రహదారి మూసివేయబడుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న మున్సిపల్ చైర్మన్ వెంటనే అధికారులతో కలిసి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వివాదాస్పద స్థలం రైతుల రహదారికి సంబంధించినదా లేదా ఎన్‌పీడీసీఎల్ పరిధిలోనిదా అనే అంశాన్ని అధికారులు స్పష్టంగా నిర్ధారించాలని సూచించారు. రైతులకు చెందిన రహదారి అయితే ఎన్‌పీడీసీఎల్ అధికారులు వెనక్కి తగ్గాలని, ఒకవేళ సంస్థకు సంబంధించిన స్థలం అయితే రైతులకు ప్రత్యామ్నాయ మార్గం కల్పించేలా అధికారులు చొరవ తీసుకోవాలని కోరారు.

రైతులకు ఇబ్బందులు తలెత్తకుండా సమస్యను త్వరితగతిన పరిష్కరించాలని సంబంధిత అధికారులను కోరారు. ఈ కార్యక్రమంలో రామన్నపల్లి రైతులు, స్థానికులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం. గంజాయి, డ్రగ్స్‌, సైబర్ నేరాలపై అవగాహన కల్పించిన జాగృతి పోలీస్ కళా బృందం.
వేలేరు, జూన్ 1 (తెలంగాణ ముచ్చట్లు): వరంగల్ నగర పోలీస్ కమిషనర్ సన్ ప్రీత్ సింగ్ ఆదేశాల మేరకు జాగృతి పోలీస్ కళా బృందం ఆదివారం రాత్రి...
భీమదేవరపల్లిలో బెల్ట్ షాపుల నిషేధానికి ఏకగ్రీవ తీర్మానం.
గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం
రైల్వే స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు.. అనుమానితులపై పోలీసుల ప్రత్యేక నిఘా.
విద్యార్థుల సర్టిఫికెట్ల జాప్యంపై ఆందోళన.. తహసీల్దార్ కార్యాలయానికి వినతిపత్రం.
పొదుపు మనిషికి ఆర్థిక స్వేచ్ఛను, ఆత్మగౌరవాన్ని అందిస్తుంది.
రైతుల రాకపోకలకు ఆటంకం వద్దు.. అధికారులకు మున్సిపల్ చైర్మన్ సూచన.