గ్రామాభివృద్ధే లక్ష్యం.. డ్రైనేజీ నిర్మాణ పనులకు సర్పంచ్ చంద్రశేఖర్ శ్రీకారం
పెద్దమందడి,జూన్01( తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం మోజర్ల గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో 7వ వార్డులో అండర్ మరియు ఓపెన్ డ్రైనేజీల ఏర్పాటు పనులకు గ్రామ సర్పంచ్ చంద్రశేఖర్ భూమి పూజ నిర్వహించి పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.గ్రామంలో పారిశుధ్యాన్ని మెరుగుపరచడం, మురుగునీటి సమస్యలకు శాశ్వత పరిష్కారం కల్పించడం లక్ష్యంగా ఈ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపడుతున్నట్లు సర్పంచ్ చంద్రశేఖర్ తెలిపారు. గ్రామ ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు అందించేందుకు గ్రామ పంచాయతీ నిరంతరం కృషి చేస్తోందన్నారు.ఈ కార్యక్రమంలో యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు రమేష్ యాదవ్, 2వ వార్డు సభ్యుడు సింగం కృష్ణయ్య, రగ్మా రెడ్డి, సాయి రెడ్డి, డి. కురుమన్న, కురుమన్న, మన్యం, ధనంజేయ, రవికుమార్, రాములు, నరసింహ, అంజి, కురుమూర్తి, వెంకటయ్య తదితరులు పాల్గొన్నారు.


Comments