ప్రసవం సజావుగానే.. ఉదయానికి శిశువు మృతి.

ప్రసవం సజావుగానే.. ఉదయానికి శిశువు మృతి.

హుజురాబాద్, మే 30 (తెలంగాణ ముచ్చట్లు):

సైదాపూర్ మండలం రాయికల్ గ్రామానికి చెందిన రమ్య అనే గర్భిణి ప్రసవం కోసం హుజూరాబాద్ ఏరియా ఆసుపత్రిలో చేరింది. శుక్రవారం రాత్రి వైద్యులు ఆమెకు సిజేరియన్ శస్త్రచికిత్స నిర్వహించగా, ఆమె ఓ మగ శిశువుకు జన్మనిచ్చింది. ప్రసవ సమయంలో తల్లి, శిశువు ఇద్దరూ ఆరోగ్యంగా ఉన్నట్లు వైద్యులు కుటుంబ సభ్యులకు తెలిపారు.
అయితే శనివారం ఉదయం నిద్రలేచి చూసేసరికి శిశువులో ఎలాంటి కదలికలు కనిపించకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు. వెంటనే వైద్య సిబ్బందికి సమాచారం అందించగా, పరీక్షించిన వైద్యులు శిశువు మృతి చెందినట్లు నిర్ధారించారు.
రాత్రి వరకు క్షేమంగా ఉన్న నవజాత శిశువు ఉదయానికి మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఘటనపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు.
ఈ ఘటనపై ఆసుపత్రి సూపరింటెండెంట్ డా. నారాయణరెడ్డి స్పందిస్తూ, ప్రసవం సజావుగా జరిగిందని, శిశువు జన్మించిన సమయంలో పూర్తిగా ఆరోగ్యంగానే ఉన్నాడని తెలిపారు. శిశువు మృతికి గల కారణాలను తెలుసుకునేందుకు అంతర్గత విచారణ చేపట్టామని, వార్డులోని సీసీటీవీ ఫుటేజీలను కూడా పరిశీలిస్తున్నామని చెప్పారు.
నవజాత శిశువు మృతి ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పూర్తి స్థాయి విచారణ జరిపి వాస్తవాలు వెలుగులోకి తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి. వర్షాకాల పార్లమెంట్ సమావేశాల్లో ఆర్డినెన్స్‌తో టెట్ మినహాయింపు కల్పించాలి.
వనపర్తి,మే30(తెలంగాణ ముచ్చట్లు): ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్) సమీక్షా పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో దేశవ్యాప్తంగా లక్షలాది మంది ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారని, వారికి ఉపశమనం కల్పించేందుకు...
ఏసీబీ ట్రాప్ కేసులో నేలకొండపల్లి పూర్వ తహసిల్దారు  నరసింహారావుకు జైలు శిక్ష.
కోర్టు వాయిదాలకు గైర్హాజరు.. నలుగురిని హుజూరాబాద్ జైలుకు తరలింపు.
యుద్ధప్రాతిపదికన గట్ల నర్సింగాపూర్ బ్రిడ్జి నిర్మించాలి!
చిట్టీ డబ్బుల వివాదం.. యువకుడి ఆత్మహత్యాయత్నం.
మహిళల ఆర్థికాభివృద్ధికి సంపూర్ణ సహకారం అందిస్తాం: చైర్మన్ దిలీప్.
పెద్దమందడి మండల కేంద్రంలో తాగునీటి సమస్య.. పట్టించుకోని అధికారులు .