బాల్క సుమన్పై ఫిర్యాదు.
సత్తుపల్లిలో కాంగ్రెస్ నాయకుల చర్య.
Views: 17
On
సత్తుపల్లి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజలను రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యలు చేశారంటూ బీఆర్ఎస్ నాయకుడు బాల్క సుమన్పై సత్తుపల్లి పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ నాయకులు గురువారం ఫిర్యాదు చేశారు. భవనాలు కూల్చండి, కార్యాలయాలు ధ్వంసం చేయండి, రైల్వే పట్టాలు కోయండి అంటూ ప్రజా, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి ప్రేరేపించేలా బాల్క సుమన్ మాట్లాడారని ఫిర్యాదులో పేర్కొన్నారు. సత్తుపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మట్టా రాగమయి దయానంద్ ఆదేశాల మేరకు సత్తుపల్లి సీఐకి వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ దోమ ఆనంద్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గాదె చెన్నారావు, సీనియర్ నాయకుడు చల్లగుళ్ల నరసింహరావు, కౌన్సిలర్లు, కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
28 May 2026 22:20:02
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు):
ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...


Comments