జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
జమ్మికుంట టౌన్ మే 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీని ఆదివారం రాష్ట్ర నాయకుల సమక్షంలో ఓటింగ్ విధానంలో ఎన్నుకున్నారు. మండల అధ్యక్షునిగా మహమ్మద్ ముస్తఫా, ఉపాధ్యక్షునిగా ఎర్ర రాజు ఎన్నికయ్యారు. అలాగే సెక్రటరీగా దొడ్డే ఆంజనేయులు, కోశాధికారిగా సుంకరి రమేష్ ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.
ఈ సందర్భంగా నూతన అధ్యక్షుడు మహమ్మద్ ముస్తఫా, ఉపాధ్యక్షుడు ఎర్ర రాజు మాట్లాడుతూ జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ను మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తామని తెలిపారు. ఫోటోగ్రాఫర్ల సంక్షేమంతో పాటు సామాజిక సేవా కార్యక్రమాల్లో కూడా సంఘం ముందుండి పనిచేస్తుందని పేర్కొన్నారు.

సభ్యుల ఐక్యతతో సంఘ అభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తామని, ఫోటోగ్రాఫర్ల సమస్యల పరిష్కారానికి కట్టుబడి ఉంటామని నూతన కమిటీ స్పష్టం చేసింది. ఈ సందర్భంగా సభ్యులు నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియజేశారు.


Comments