మండల అధ్యక్షుడు కొమ్ము వెంకటస్వామిని సన్మానించిన వెల్టూర్ కాంగ్రెస్ నాయకులు.
పెద్దమందడి,మే28(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండల కాంగ్రెస్ పార్టీ నూతన అధ్యక్షుడిగా నియమితులైన కొమ్ము వెంకటస్వామిని వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ నాయకులు గురువారం మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ బలోపేతానికి కొమ్ము వెంకటస్వామి సమర్థవంతంగా పనిచేస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. గ్రామ స్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలను మరింత చురుకుగా నిర్వహిస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని ఆకాంక్షించారు.అనంతరం పూలమాలలు వేసి, శాలువాతో సత్కరించి అభినందనలు తెలియజేశారు. మండల ప్రజల సమస్యల పరిష్కారానికి కట్టుబడి పనిచేస్తానని కొమ్ము వెంకటస్వామి తెలిపారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.సన్మానించిన వారిలో వెల్టూర్ గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రేమ్ సాగర్, మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు బాబు రెడ్డి, మాజీ ఉపసర్పంచ్ మల్లికార్జున్ ఉన్నారు.


Comments