ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.

ఉద్యమ కారుల జెఏసి వ్యవస్థాపకులు పిడమర్తి రవి.

ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.

హైదరాబాద్,మే28(తెలంగాణ ముచ్చట్లు):

తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం కేటాయించడంతో పాటు పింఛన్, గుర్తింపు కార్డులు ఇవ్వాలని తెలంగాణ ఉద్యమకారుల సంఘం వ్యవస్థాపకుడు డాక్టర్ పిడమర్తి రవి డిమాండ్ చేశారు.నాగర్‌కర్నూల్ పట్టణంలో తెలంగాణ ఉద్యమకారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఎండీ రహీం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళన సన్నాహక సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పిడమర్తి రవి మాట్లాడారు. జూన్ 21న ఇందిరాపార్క్‌లో నిర్వహించే ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని వేలాదిమంది ఉద్యమకారులు హాజరై విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమానికి మంత్రి జూపల్లి కృష్ణారావు హాజరుకానున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని కోరారు.
నాగర్‌కర్నూల్ జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఉద్యమకారులు రాములు నాయక్, ధర్మరాజు, గుడిపల్లి రవి, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, జయశంకర్, బీఎస్ఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కే రామకృష్ణ,పోలే నరేందర్, గుడిపల్లి శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260528-WA0139

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.