ప్రజా సమస్యలపై గళమెత్తనున్న భారీ బహిరంగ సభ.

ప్రజా సమస్యలపై గళమెత్తనున్న భారీ బహిరంగ సభ.

జమ్మికుంట టౌన్ మే 28 (తెలంగాణ ముచ్చట్లు):

ధర్మ సమాజ్ పార్టీ మద్దతుతో బీసీ, ఎస్సీ, ఎస్టీ - జేఏసీ ఆధ్వర్యంలో జూన్ 4న కరీంనగర్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయడానికి నాయకులు విస్తృతంగా మద్దతు కూడగడుతున్నారు. ఇందులో భాగంగా బుధవారం జమ్మికుంట మండలంలో పలువురు మైనార్టీ, కుల సంఘాల నాయకులను కలిసి సభకు ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మైనార్టీ షేరియా కమిటీ అధ్యక్షులు జాకీర్ గారిని, ఉపాధ్యక్షులు జాకీర్ మహమ్మద్ గారిని ప్రత్యేకంగా కలిసి సభ ప్రాముఖ్యతను వివరించి, భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. అలాగే వివిధ కుల సంఘాల నాయకులతో సమావేశమై సామాజిక న్యాయం, హక్కుల సాధన కోసం ఈ సభ కీలకమని తెలిపారు.

నాయకులు మాట్లాడుతూ.. బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల సమస్యలు, హక్కుల పరిరక్షణ కోసం నిర్వహిస్తున్న ఈ సభ ప్రజల్లో చైతన్యం తీసుకురావడంలో ముఖ్యపాత్ర పోషిస్తుందని పేర్కొన్నారు. జూన్ 4న కరీంనగర్‌లో జరిగే సభకు అన్ని వర్గాల ప్రజలు పెద్దఎత్తున హాజరై విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇంచార్జి చిలువేరు శ్రీకాంత్, హుజురాబాద్ జేఏసీ ఇంచార్జి చందు యాదవ్, జమ్మికుంట మండల నాయకులు మాడుగుల సందీప్, సాగర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.