తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
హైదరాబాద్,మే28(తెలంగాణ ముచ్చట్లు):
జూన్ 21న నిర్వహించనున్న తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనానికి సంబంధించిన కరపత్రాన్ని మాజీ మంత్రి మోత్కుపల్లి నరసింహ విడుదల చేశారు.కొత్తకోట పట్టణంలో ఎస్సీ కార్పొరేషన్ మాజీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడు డాక్టర్ పిడమర్తి రవి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొన్న మోత్కుపల్లి నరసింహ సమ్మేళన కరపత్రాన్ని ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం, పింఛన్, గుర్తింపు కార్డులు కల్పించాలనే ప్రధాన డిమాండ్లతో ఈ నెల 21న ఇందిరాపార్క్లో తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళనం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పందించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో ముంజగళ్ల విజయ్, బీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు బోరెల్లి సురేష్, ముపురి కుమార్, మీసాల మహేష్ తదితర నాయకులు పాల్గొన్నారు.


Comments