వెల్టూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

వెల్టూర్ లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి వేడుకలు.

పెద్దమందడి,మే28(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు నందమూరి తారక రామారావు జయంతిని ఘనంగా నిర్వహించారు. మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన మండల అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని దేశవ్యాప్తంగా చాటిచెప్పిన మహానేత ఎన్టీఆర్ అని కొనియాడారు. పేద ప్రజల సంక్షేమం కోసం ఆయన ప్రవేశపెట్టిన పథకాలు నేటికీ ప్రజలకు ఆదర్శంగా నిలుస్తున్నాయని అన్నారు.రాజకీయాల్లో విలువలు, ప్రజాసేవకు ఎన్టీఆర్ మారుపేరుగా నిలిచారని పేర్కొన్నారు.సినీ రంగంలోనూ, రాజకీయాల్లోనూ చెరగని ముద్ర వేసిన ఎన్టీఆర్ ఆశయాలను ప్రతి ఒక్కరూ కొనసాగించాలని శ్రీనివాసరెడ్డి పిలుపునిచ్చారు. అనంతరం కార్యకర్తలతో కలిసి జయంతి వేడుకలను నిర్వహించారు.ఈ కార్యక్రమంలో దయల రమేష్, మెరుగు కుర్మయ్య, ఆంజనేయులు గౌడ్, నాగరాజు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు. ప్రజల భద్రతే లక్ష్యం ఎల్కతుర్తిలో విస్తృత వాహన తనిఖీలు.
ఎల్కతుర్తి, మే 28 (తెలంగాణ ముచ్చట్లు): ప్రజల భద్రతను దృష్టిలో ఉంచుకొని హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల కేంద్రంలో గురువారం సాయంత్రం పోలీసులు విస్తృత స్థాయిలో ప్రత్యేక...
తెలంగాణ ఉద్యమకారుల సమ్మేళన కరపత్రాన్ని విడుదల చేసిన మోత్కుపల్లి .
తెలంగాణ ఉద్యమకారుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయాలి.
ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలి.
బాల్క సుమన్‌పై ఫిర్యాదు.
ఉచిత ఆన్లైన్ విద్యను సద్వినియోగం చేసుకోండి - మాజీ ఎంపీ నామ.
ఎన్టీఆర్ జననమే ఒక చరిత్ర : మాజీ ఎంపీ నామ.