ఖాదర్‌ బాబాకు టీడబ్ల్యూజేఎఫ్ సన్మానం.

ఖాదర్‌ బాబాకు టీడబ్ల్యూజేఎఫ్ సన్మానం.

 జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతల స్వీకారం
పఠనాసక్తి పెంపొందించేలా లైబ్రరీలను తీర్చిదిద్దాలని సూచన

ఖమ్మం బ్యూరో, మే 24(తెలంగాణ ముచ్చట్లు )

ఖమ్మం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఆదివారం బాధ్యతలు స్వీకరించిన ఎండీ ఖాదర్ బాబాను తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్స్ ఫెడరేషన్ (టీడబ్ల్యూజేఎఫ్ - హెచ్ 2843) ఖమ్మం జిల్లా కమిటీ సన్మానించింది. స్థానిక పాత మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన చైర్మన్ చాంబర్ లో యూనియన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు సయ్యద్ ఖదీర్, కొత్తపల్లి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షులు దువ్వా సాగర్, జర్నలిస్టు అక్రిడిటేషన్ కమిటీ సభ్యులు నలుబోల మధులత, అర్షద్, యూనియన్ నాయకులు కొరకొప్పుల రాంబాబు, తదితరులు  చైర్మన్ ను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. యూనియన్ జ్ఞాపిక, డైరీని అందజేసి శాలువ కప్పి సన్మానించారు. పఠనాసక్తిని  పెంపొందించేలా జిల్లాలోని గ్రంథాలయాలను తీర్చిదిద్దాలని సూచించారు. పత్రికలన్నీ గ్రంథాలయాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని కోరారు. గ్రంథాలయాల్లో వసతులు మెరుగుపర్చాలని, డిజిటల్ లైబ్రరీలుగా తీర్చిదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు. కరీంనగర్ జిల్లా హుజురాబాద్ లో రైతులకు ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కీలక విజ్ఞప్తి చేశారు.
హుజురాబాద్,మే 24(తెలంగాణ ముచ్చట్లు ): ప్రస్తుతం మండుతున్న ఎండలు, పొడి వాతావరణ పరిస్థితుల కారణంగా పొలాల్లో వరి కోయ్యలు, గడ్డి అవశేషాలు కాల్చడం వల్ల భారీ అగ్ని...
మరణానంతరం ఇద్దరికి చూపునిచ్చిన రావికంటి రాజయ్య నేత్రదానం.
మడిపల్లి అగ్నిప్రమాద బాధిత గౌడ కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి.
జమ్మికుంట మండల ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక.
ప్రజల ఆరోగ్య రక్షణే ప్రభుత్వ లక్ష్యం : చైర్‌పర్సన్ రొంటాల సుహాసిని
పేదరికం బలి తీసుకున్న మరో ప్రాణం.
అమరుల త్యాగాలతో ఏర్పడిన తెలంగాణను మరవొద్దు.