పోస్ట్ ఆఫీస్ సేవలపై అవగాహన సదస్సు నిర్వహణ .
Views: 5
On
వేలేరు, మే 27 (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండల కేంద్రంలోని తపాల శాఖ కార్యాలయం (పోస్ట్ ఆఫీస్)ను వేలేరు మండల సర్పంచుల ఫోరం అధ్యక్షులు మరియు వేలేరు మేజర్ గ్రామపంచాయతీ సర్పంచ్ బిల్లా యాదగిరి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రభుత్వం అందిస్తున్న ఆసరా పింఛన్ లబ్ధిదారుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే తపాల శాఖ ద్వారా అమలు చేస్తున్న వివిధ రకాల పొదుపు పథకాలపై అవగాహన సదస్సు నిర్వహించారు.
సర్పంచ్ అయిన బిల్లా యాదగిరి మాట్లాడుతూ, పోస్ట్ ఆఫీస్ ద్వారా అందిస్తున్న బీమా, బ్యాంకింగ్ సేవలు మరియు వివిధ రకాల పొదుపు పథకాలను గ్రామ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో పోస్ట్ ఆఫీస్ అధికారి నవ్యతో పాటు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments