కౌన్సిలర్ ఫిర్యాదుతో అర్ధరాత్రే సమస్య పరిష్కారానికి చర్యలు.
జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణంలోని రామన్నపల్లి 3వ వార్డులో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, స్థానిక కౌన్సిలర్ ఫోన్కే మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.
3వ వార్డు కౌన్సిలర్ కొలకని రాజకుమారి రాజు ఎండాకాలంలో వార్డులో నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాత్రి సమయంలోనే మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గేట్ వాల్ లీకేజీ కారణంగా సమస్య తలెత్తిందని వివరించారు.
దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఏఈ వికాస్తో కలిసి ఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిశీలించారు. తక్షణ చర్యలు తీసుకుని నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.
ప్రజలకు తమ పాలకవర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యలు వచ్చిన వెంటనే స్పందిస్తామని చైర్మన్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఏఈ వికాస్, మిషన్ భగీరథ ఏఈ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.


Comments