కౌన్సిలర్ ఫిర్యాదుతో అర్ధరాత్రే సమస్య పరిష్కారానికి చర్యలు.

కౌన్సిలర్ ఫిర్యాదుతో అర్ధరాత్రే సమస్య పరిష్కారానికి చర్యలు.

జమ్మికుంట టౌన్ మే 19 (తెలంగాణ ముచ్చట్లు):

జమ్మికుంట పట్టణంలోని రామన్నపల్లి 3వ వార్డులో తాగునీటి సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతుండగా, స్థానిక కౌన్సిలర్ ఫోన్‌కే మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ వెంటనే స్పందించి సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టారు.

3వ వార్డు కౌన్సిలర్ కొలకని రాజకుమారి రాజు ఎండాకాలంలో వార్డులో నల్లా నీటి సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఎదుర్కొంటున్న ఇబ్బందులను రాత్రి సమయంలోనే మున్సిపల్ చైర్మన్ దృష్టికి తీసుకెళ్లారు. గేట్ వాల్ లీకేజీ కారణంగా సమస్య తలెత్తిందని వివరించారు.

దీనిపై వెంటనే స్పందించిన చైర్మన్ సంబంధిత అధికారులకు ఫోన్ చేసి, ఏఈ వికాస్‌తో కలిసి ఘటన స్థలానికి వెళ్లి సమస్యను పరిశీలించారు. తక్షణ చర్యలు తీసుకుని నీటి సరఫరా సమస్యను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.

ప్రజలకు తమ పాలకవర్గం ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటుందని, సమస్యలు వచ్చిన వెంటనే స్పందిస్తామని చైర్మన్ తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఏఈ వికాస్, మిషన్ భగీరథ ఏఈ మరియు స్థానిక నాయకులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం. ఉమ్మడి మండలాల మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డికి ఘన సన్మానం.
పెద్దమందడి,మే19(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా  పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మండలాల ఉమ్మడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్‌గా నూతనంగా నియమితులైన కొత్తకాపు వెంకటేశ్వర్ రెడ్డిని కాంగ్రెస్ నాయకులు ఘనంగా...
జర్నలిస్టులు ప్రజల సమస్యలకు వారధిగా నిలవాలి: ప్రణవ్ బాబు.
హుజురాబాద్‌లో ట్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు.
పెద్దమందడి–ఖిల్లా ఘనపూర్ మార్కెట్ యార్డ్ చైర్మన్, వైస్ చైర్మన్‌లకు ఘన సన్మానం.
రైతుల నష్టాలను అరికట్టడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యం.
ఆసరా పెన్షన్ లబ్ధిదారులకు కీలక సూచన.
మక్కల కొనుగోళ్లపై రైతులకు భరోసా ఇచ్చిన వొడితల ప్రణవ్.