జమ్మికుంటకు గుర్తుండిపోయే అధికారి…
ఎస్ఐ సతీష్కు భావోద్వేగ వీడ్కోలు
Views: 11
On
జమ్మికుంట టౌన్ మే 06 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పోలీస్ స్టేషన్ ఈ రోజు భావోద్వేగ క్షణాలకు వేదికైంది. ప్రజల మనసుల్లో చెరగని ముద్ర వేసుకున్న సబ్ ఇన్స్పెక్టర్ సతీష్ బదిలీ నేపథ్యంలో, సర్కిల్ ఇన్స్పెక్టర్ రామకృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించి, ఆత్మీయంగా వీడ్కోలు పలికారు.
పోలీస్ సిబ్బంది సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమం సాదాసీదా వీడ్కోలు కాకుండా, ఒక సేవా యోధుడికి ప్రజలు, సహచరులు కలసి తెలిపిన గౌరవంగా నిలిచింది. పలువురు సిబ్బంది భావోద్వేగంతో సతీష్తో తమ అనుభవాలను పంచుకుంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు.
జమ్మికుంటలో విధులు చేపట్టిన కొద్ది కాలంలోనే ఎస్ఐ సతీష్ ప్రజలకు చేరువై, సమస్యల పరిష్కారంలో చురుకైన పాత్ర పోషించారు. ఎలాంటి ఫిర్యాదు వచ్చినా ఆలస్యం చేయకుండా స్పందిస్తూ, న్యాయం జరిగేలా కృషి చేయడం ఆయన ప్రత్యేకతగా నిలిచింది. క్రమశిక్షణతో పాటు మానవీయ దృక్పథం కలిగిన అధికారిగా ఆయన పేరు తెచ్చుకున్నారు.
కేవలం 10 నెలల వ్యవధిలోనే తన పనితీరుతో ప్రత్యేక గుర్తింపు సాధించిన సతీష్, పై అధికారుల ప్రశంసలతో పాటు ప్రజల ప్రేమను కూడా సంపాదించారు. ఇలాంటి అధికారి బదిలీ కావడం పట్ల స్థానికులు, సిబ్బంది కలత చెందారు.
ఈ సందర్భంగా సహచరులు మాట్లాడుతూ,
“మీరు మాకు కేవలం అధికారి కాదు, మార్గదర్శకులు… మీ సేవలు ఎప్పటికీ మాకు ఆదర్శం” అని ప్రశంసించారు. అనంతరం శాలువాతో సత్కరించి స్మారక చిహ్నం అందజేశారు.
ప్రస్తుతం సతీష్ మిరుదొడ్డి ఎస్హెచ్ఓగా బాధ్యతలు స్వీకరించనున్నారు. కొత్త బాధ్యతల్లో మరింత విజయాలు సాధించాలని అందరూ ఆకాంక్షించారు.

Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments