ఆశ కార్యకర్తల నిరసన.
Views: 3
On
హుజురాబాద్ మే 5(తెలంగాణ ముచ్చట్లు ):
హుజురాబాద్ మండలం చెల్పూర్ గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పిహెచ్చి ) ముందు ఆశ కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలతో శాంతియుత నిరసన కార్యక్రమం నిర్వహించారు. తమకు రావాల్సిన మార్చి, ఏప్రిల్ నెలల పెండింగ్ పారితోషికాలను వెంటనే విడుదల చేయాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ సందర్భంగా ఆశ కార్యకర్తలు మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఆరోగ్య సేవలు అందించడంలో తాము కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, సరైన వేతనాలు అందక ఇబ్బందులు పడుతున్నామని తెలిపారు. సమయానికి పారితోషికాలు రాకపోవడం వల్ల ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
అదేవిధంగా ఆశ కార్యకర్తలకు నెలకు కనీసం రూ.18,000 ఫిక్స్ వేతనం అమలు చేయాలని కోరారు. ప్రభుత్వం తమ సమస్యలను గుర్తించి తక్షణ చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
ఈ నిరసన కార్యక్రమంలో పలువురు ఆశ కార్యకర్తలు పాల్గొని తమ ఐక్యతను చాటారు. సమస్యలు పరిష్కారం కాని పక్షంలో భవిష్యత్తులో మరింత పెద్ద స్థాయిలో ఆందోళనలు చేపట్టాల్సి వస్తుందని హెచ్చరించారు.
నిరసన అనంతరం ఆశ కార్యకర్తలు తిరిగి తమ విధుల్లో చేరి సేవలను కొనసాగించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 22:32:34
జమ్మికుంట టౌన్ మే 05 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట పట్టణ పరిధిలో మున్సిపల్ చైర్మన్ మొలుగు ప్రశాంత్ కుమార్ దిలీప్ పలు వార్డులను సందర్శించి శానిటేషన్ పనులను...


Comments