చేతబడి హడావిడి… నిజం చెబుతున్న డాక్టర్ ప్రభు!

చేతబడి హడావిడి… నిజం చెబుతున్న డాక్టర్ ప్రభు!

జమ్మికుంట టౌన్ మే 04 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మున్సిపాలిటీ పరిధిలోని కొత్తపల్లి నుండి శ్రీరాములపల్లి, మడిపల్లి వైపు వెళ్లే మూడు దారుల కూడలిలో ఆదివారం అర్ధరాత్రి భూత వైద్యుల చర్యలు వెలుగులోకి వచ్చాయి. స్టార్ ఆకారంలో ముగ్గు వేసి, పసుపు, కుంకుమ, నిమ్మకాయలు, న్యూస్‌పేపర్‌తో మనిషి ఆకారంలో బొమ్మ తయారు చేసి పూజలు నిర్వహించిన ఆనవాళ్లు కనిపించాయి.
ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. ఆ మార్గంలో వెళ్లే ప్రజలకు ప్రమాదం సంభవించే అవకాశం ఉందని భావించి సమాచారం అందించగా, డాక్టర్ అంబాల ప్రభాకర్ (ప్రభు) ఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న పేద, మధ్యతరగతి ప్రజలు భూత వైద్యులను ఆశ్రయించడం దురదృష్టకరమని తెలిపారు. ఇలాంటి అశాస్త్రీయ పద్ధతులకు వేలాది రూపాయలు ఖర్చు చేయడం అజ్ఞానమని విమర్శించారు.
ఆర్థిక పరిస్థితులు మెరుగుపడాలంటే కష్టపడి పనిచేయాలని, అనారోగ్య సమస్యలు ఉంటే ఆసుపత్రులకు వెళ్లి వైద్యుల సలహాలు తీసుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలకు భయపడకుండా ధైర్యంగా జీవించాలని ప్రజలకు పిలుపునిచ్చారు.
అనంతరం అక్కడ ఉన్న న్యూస్‌పేపర్ బొమ్మను కాల్చివేసి, నిమ్మకాయలను తొలగించి, ముగ్గు, పసుపు, కుంకుమ ఆనవాళ్లను నీటితో శుభ్రం చేశారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా. సేంద్రియ సాగుతో భూమికి శక్తి  రైతుల భవిష్యత్తుకు భరోసా.
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):    ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...
మహిళలకు స్వయం ఉపాధి దిశగా మినీ డైరీ యూనిట్లు.
గీత కార్మికుల చేత శీలం అనిల్ కుమార్ దంపతులకు ఘన సన్మానం.
ప్రతి నిరుపేదకు పక్కా ఇల్లు నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయం..
వంట నష్టపోయిన రైతులను ఆదుకోవాలి.
నకిలీ పత్రాల ఫోర్జరీ కేసులో నిందుతుడు అరెస్ట్ రిమాండ్ కు తరలింపు.
క్లబ్‌పై ఆడిటింగ్ జరపాలి..