వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల పరిశీలన.
Views: 1
On
ధాన్యాన్ని త్వరగా ఆరబెట్టి మిల్లులకు తరలించాలి
జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్
మంచిర్యాల.మే 4(తెలంగాణ ముచ్చట్లు)
ఇటీవల కురిసిన వర్షాల కారణంగా సోమవారం మందమర్రి మండలంలోని సారంగపల్లి, బొక్కలగుట్ట ప్రాంతాలలోని వరి కొనుగోలు కేంద్రాలను సందర్శించి తడిసిన దాన్యాన్ని ఆరబెట్టి త్వరగా మిల్లులకు తరలించాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ అన్నారు, ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతుల వద్ద నుండి మద్దతు ధర చెల్లించి వరి ధాన్యం కొనుగోలు చేస్తుందని తెలిపారు, ఇటీవల కురిసిన వర్షాలకు తడిచిన ధాన్యాన్ని ఆరబెట్టి కేటాయించిన మిల్లులకు త్వరగా తరలించాలని నిర్వాహకులకు సూచించారు, ప్రభుత్వం చేపట్టిన వరి ధాన్యం కొనుగోలు ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని తెలిపారు, రైతులు ధాన్యాన్ని నిబంధనల ప్రకారం కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని, రైతుల సౌకర్యార్థం కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, నీడ, తూకం యంత్రాలు, ప్యాడి క్లీనర్లు ఇతర సదుపాయాలు కల్పించాలని తెలిపారు, రైతు యొక్క వివరాలను సిస్టం లో నమోదు చేసి ఆధార్ కార్డు ద్వారా వారి గుర్తింపును దృవీకరించాలని, రైతు భూమి విస్తీర్ణం, పండించిన ధాన్యం వివరాలను సరి చూడాలని, ధాన్యం నాణ్యత ప్రమాణాలకు అనుగుణంగా ఉండే విధంగా పరిశీలించాలని తెలిపారు, కొనుగోలు చేసిన ధాన్యానికి సంబంధించి రైతుల బ్యాంకు ఖాతాలలో నగదు జమ చేయడం జరుగుతుందని తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
05 May 2026 17:01:04
ఎల్కతుర్తి, మే 5( తెలంగాణ ముచ్చట్లు):
ప్రజాపాలన ప్రగతిప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా దండేపల్లి గ్రామంలో నిర్వహించిన “రైతుల ముంగిట్లో శాస్త్రవేత్తలు” కార్యక్రమం రైతుల్లో కొత్త...


Comments