పాపక్కపల్లి మత్స్య సంఘ ఎన్నికలు ప్రశాంతంగా ముగింపు.
నూతన కమిటీ ఏకగ్రీవంగా ఎన్నిక .
Views: 2
On
జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
జమ్మికుంట మండలం పాపక్కపల్లి మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఎన్నికలు శుక్రవారం ప్రశాంత వాతావరణంలో నిర్వహించబడినట్లు ఎన్నికల అధికారి నాగుల మనోజ్ తెలిపారు. ఎటువంటి ఉద్రిక్తతలు లేకుండా సజావుగా పోలింగ్ ప్రక్రియ పూర్తయిందని ఆయన వెల్లడించారు.
ఈ ఎన్నికల్లో సంఘ అధ్యక్షుడిగా పంజ రమేష్, ఉపాధ్యక్షుడిగా పుట్టకొక్కుల రమేష్, కార్యదర్శిగా పుట్టకొక్కుల రాజు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించారు. సభ్యుల ఏకాభిప్రాయంతో నూతన కార్యవర్గం ఎంపిక కావడం సంఘంలో ఐక్యతను ప్రతిబింబిస్తోందని పేర్కొన్నారు.
నూతనంగా ఎన్నికైన కమిటీ సభ్యులు సంఘ అభివృద్ధి కోసం కృషి చేయాలని, మత్స్యకారుల సంక్షేమం, జీవనోపాధి మెరుగుదల కోసం పలు కార్యక్రమాలు చేపట్టాలని ఎన్నికల అధికారి ఆకాంక్షించారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
24 Apr 2026 22:14:04
ఎల్కతుర్తి, ఏప్రిల్ 24 (తెలంగాణ ముచ్చట్లు):
కాళేశ్వరం ప్రాజెక్టుపై ప్రతిపక్ష పార్టీలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా రాజకీయ ప్రేరితమని, వాటికి హైకోర్టు తీర్పు గట్టి సమాధానమని బీఆర్ఎస్...


Comments