హుజురాబాద్ సమస్యలపై సెక్రటేరియట్లో చర్చ.
సొల్లు బాబు, మంత్రి భేటీ.
Views: 8
On
హుజురాబాద్ టౌన్ ఏప్రిల్ 22 (తెలంగాణ ముచ్చట్లు) :
హైదరాబాద్ సెక్రటేరియట్లో బొగ్గు గనుల శాఖ మరియు కార్మిక శాఖ మంత్రివర్యులు డాక్టర్ గడ్డం వివేకానంద వెంకట స్వామిని జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు సొల్లు బాబు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హుజురాబాద్ పరిధిలో కొనసాగుతున్న డంపింగ్ యార్డ్ నిరసనల విషయాలను మంత్రికి వివరించారు.
ప్రాంత ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఆందోళనలపై సొల్లు బాబు వివరంగా తెలియజేయగా, మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ అంశాన్ని ముఖ్యమంత్రికి తెలియజేసి తగిన చర్యలు తీసుకునేలా చూస్తానని హామీ ఇచ్చారు.
ప్రజల సమస్యల పరిష్కారం కోసం తాము నిరంతరం కృషి చేస్తామని సొల్లు బాబు తెలిపారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments