దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.

దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మండలం ధర్మారం పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ముద్ధమల్ల రవీందర్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, మహిమాన్వితమైన దుబ్బ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొత్త పాలకవర్గానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎఎంసీ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సలీం, యువ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్, అశోక్, నెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'.. కబ్జా స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా?'..
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 20(తెలంగాణ ముచ్చట్లు )    స్థలంలో మీటింగ్ పెట్టి మాకు నీతులు చెబుతున్నారా అంటూ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధ్వజమెత్తారు. సోమవారం ఖమ్మం నగరంలోని...
తెలంగాణ ఉద్యమకారులకు కృతజ్ఞతలు.
హుజురాబాద్ మార్కెట్ యార్డులో వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం…
బోటి గుట్టపై మల్లన్న జాతర జోష్.
గ్రామపంచాయతీ నిధుల వినియోగంపై అవగాహన సదస్సు .
దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.
బలీదుపల్లిలో ఐకేపీ వరి కొనుగోలు కేంద్రం ప్రారంభం.