దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.

దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం పాలకవర్గానికి ఘన సన్మానం.

జమ్మికుంట టౌన్ ఏప్రిల్ 20 (తెలంగాణ ముచ్చట్లు):
 
జమ్మికుంట మండలం ధర్మారం పరిధిలోని శ్రీ దుబ్బ మల్లికార్జున స్వామి దేవస్థానం కొత్త పాలకవర్గం ప్రమాణ స్వీకారం సందర్భంగా ఆలయ చైర్మన్ ఇంగిలే రామారావు ఆధ్వర్యంలో ఘన సన్మానం నిర్వహించారు. ఈ సందర్భంగా చైర్మన్ ముద్ధమల్ల రవీందర్‌తో పాటు పాలకవర్గ సభ్యులను శాలువాలతో సత్కరించారు.
ఈ సందర్భంగా రామారావు మాట్లాడుతూ, మహిమాన్వితమైన దుబ్బ మల్లికార్జున స్వామివారిని దర్శించుకోవడం ఆనందంగా ఉందన్నారు. కొత్త పాలకవర్గానికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు కలగాలని స్వామివారిని ప్రార్థించారు. దేవస్థానానికి వచ్చే భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు కల్పించి, ఆలయాన్ని మరింత అభివృద్ధి దిశగా తీసుకెళ్లాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఎఎంసీ ఉపాధ్యక్షుడు సతీష్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు సలీం, యువ కాంగ్రెస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగరాజు, శ్రీనివాస్, అశోక్, నెల్లి అశోక్ తదితరులు పాల్గొన్నారు.
Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .