ఆగారం గ్రామంలో జల మహోత్సవం నిర్వహణ.
Views: 34
On
ఘనపూర్,ఏప్రిల్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా ఘనపూర్ మండలంలోని ఆగారం గ్రామంలో సోమవారం జలజీవన్ మిషన్ ఆధ్వర్యంలో జల మహోత్సవ కార్యక్రమం నిర్వహించబడింది. హర్ ఘర్ జల్ కార్యక్రమంలో భాగంగా మిషన్ భగీరథ ద్వారా అందిస్తున్న తాగునీటిని ప్రజలు వినియోగించుకోవాలని అధికారాలు సూచించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మిషన్ భగీరథ డీఈ హరీష్ కుమార్, ఏఈ నరేష్ కుమార్ పాల్గొన్నారు.వారు మాట్లాడుతూ భగీరథ నీరు సురక్షితమైనదని, ప్రతి ఒక్కరూ తాగునీటిని ఉపయోగించుకోవాలని తెలిపారు. మండల కాంగ్రెస్ నాయకుడు మున్నూరు జయాకర్ మాట్లాడుతూ.. గ్రామంలో మిషన్ భగీరథ నీరు సకాలంలో అందుతున్నదని, ప్రజలు నీటిని జాగ్రత్తగా వినియోగిస్తున్నారని చెప్పారు.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది.
ఈ కార్యక్రమంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, గ్రామ ప్రజలు మరియు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. కార్యక్రమం విజయవంతంగా జరిగింది.Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Aug 2026 21:27:41
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు):
వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...


Comments