మల్లాపూర్‌లో బస్తీ బాట

_ప్రజా సమస్యలపై నెమలి అనిల్ కుమార్ ప్రత్యక్ష పరిశీలన

మల్లాపూర్‌లో బస్తీ బాట

మల్లాపూర్, ఏప్రిల్ 16 (తెలంగాణ ముచ్చట్లు):

ఉప్పల్ నియోజకవర్గం నాచారం సర్కిల్ మల్లాపూర్ డివిజన్‌లో ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యతనిస్తూ బస్తీ బాట కార్యక్రమాన్ని నిర్వహించినట్లు నాయకుడు నెమలి అనిల్ కుమార్ తెలిపారు.ఈ కార్యక్రమంలో భాగంగా మల్లాపూర్ వాటర్ వర్క్స్ ఏఈ రోహిత్‌తో కలిసి అన్నపూర్ణ కాలనీ, ఎన్‌టీఆర్ నగర్ కాలనీ, జయశంకర్ కాలనీలను సందర్శించారు. కాలనీల్లో తాగునీటి తక్కువ ఒత్తిడి, సీవరేజ్, డ్రైనేజీ సమస్యలను ప్రత్యక్షంగా పరిశీలించి స్థానికులతో మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు ఆదేశాలు ఇచ్చినట్లు ఆయన తెలిపారు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడం, సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం తన ప్రధాన లక్ష్యమని నెమలి అనిల్ కుమార్ పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో మల్లాపూర్ జనరల్ సెక్రటరీ తాండ్ర శ్రీకాంత్ రెడ్డి, సీనియర్ నాయకులు మక్తాల బాలరాజ్ గౌడ్, ఉండం శ్రీనివాస్, కొయలకొండ రాజేష్, నిక్కీ గౌడ్, లక్ష్మీపతి, సురేష్, అన్వర్ పఠాన్ గారుపాషా, రషీద్ తదితరులు పాల్గొన్నారు.IMG-20260416-WA0105

Tags:

Post Your Comments

Comments

Latest News

ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు ఆటో డ్రైవర్లకు కంటి చూపు పరీక్షలు
ఖమ్మం బ్యూరో, ఏప్రిల్ 16(తెలంగాణ ముచ్చట్లు ) డ్రైవింగ్ వృత్తిలో కంటి చూపు చాలా కీలకమైనదని, కంటి చూపు బాగుంటేనే వాహనాన్ని సమర్థవంతంగా నడపగలుగుతారని ఇన్స్పెక్టర్ కరుణాకర్...
హుజురాబాద్‌లో ఏప్రిల్ 25న హిందూ స్వర్ణ శంకన సమ్మేళనం.
గ్రంథాలయ సభ్యత్వ మేళా… విద్యార్థుల్లో జ్ఞానవికాసానికి నాంది.
ప్రజాపాలనపై దృష్టి… హుజురాబాద్‌లో మండల స్థాయి సమీక్ష సమావేశం
ఎన్నికల హామీలు అమలు చేయాలి… ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే ప్రారంభించాలి.
జమ్మికుంటలో అంబేద్కర్ జయంతి రచ్చ… అధికారులపై కాంగ్రెస్ ఫైర్
పేదలకు నాణ్యమైన వైద్యం అందించడమే లక్ష్యం